టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ మద్య బంధుత్వం ఉన్న విషయం తెలిసిందే. డి.రామానాయుడు కూతురు లక్ష్మిని అక్కినేని నాగార్జున వివాహం చేసుకున్నారు. కొంత కాలం తర్వాత వీరిద్దరూ విడాకులు ఇచ్చుకున్నారు. లక్ష్మికి పుట్టిన బాబు ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్న అక్కినేని నాగచైతన్య. ఇక డి సురేష్ బాబు, వెంకటేష్ సోదరి లక్ష్మి ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది. అయితే పుట్టినప్పటి నుంచి నాగ చైతన్య తన తాత డి రామానాయుడి వద్దనే పెరిగారు. వయసు వచ్చిన తర్వాత అక్కినేని కుటుంబానికి దగ్గరయ్యాడు. ఇక మామా-అల్లుడు మద్య ఎంత మంచి రిలేషన్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ మద్య ప్రేమమ్ సినిమాలో నాగ చైతన్య మామయ్యగా ప్రిన్సిపాల్ ని బెదిరిండానికి వస్తాడు వెంకటేష్. ఆ తర్వాత మామా అల్లుడు కలిసి నటిస్తున్న మూవీ ‘వెంకిమామ’.బసురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై సురేష్ బాబు, టి జి. విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం వెంకీమామ. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 మూవీ వెంకీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
అదే జోరుతో ప్రస్తుతం మరిన్ని మూవీల్లో వెంకీ నటిస్తున్నాడు. మల్టీస్టారర్ సినిమాలకు టాలీవుడ్ లో ఈ సీనియర్ హీరో బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. జైలవకుశ ఫేమ్ బాబీ ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో వెంకీ రైస్ మిల్ ఓనర్ గా, చైతు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వెంకీ మామ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని వినాయకి చవితి కానుకగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్లో మామ అల్లుళ్ళు ఇద్దరు యెర్ర చొక్కా తెల్ల పంచె ధరించి ఒకరినొకరు భుజాలపై చేతులు వేసుకుంటూ అలా షికారుకు వెళ్తున్నట్టు పోజిచ్చారు.ఈ మూవీతో వెంకీ మరోసారి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న వెంకీ మామ మూవీ మ్యూజికల్ హిట్ కానుందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.