యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా మలయాళం లో క్రేజీ ఆఫర్ పట్టేసింది. నూతన దర్శకుడు అనూప్ సత్యాన్ మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమా తెరకెక్కించనున్నాడు. ఈచిత్రం లో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించనుంది. ఫ్యామిలీ డ్రామాగా తెరక్కనున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శోభన, సురేష్ గోపి కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈసినిమా లో శోభన రోల్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుందని సమాచారం .
అక్టోబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుండగా దుల్కర్ సల్మాన్ ఈ చిత్రానికి సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈసినిమాతో పాటు కళ్యాణి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్ లు వున్నాయి. ప్రస్తుతం ఈసినిమాతో పాటు కళ్యాణి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్ లు వున్నాయి. అందులో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న మరక్కార్ కూడా ఒకటి. ఇటీవలే ఈసినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది కళ్యాణి. ఈసినిమా ను ఆమె తండ్రి, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్నాడు.
ఇక ఈసినిమా గాక కళ్యాణి తమిళంలో స్టార్ హీరో శివ కార్తికేయన్ తో హీరో అనే సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కోలీవుడ్ లో ఇదే ఆమె కు మొదటి సినిమా. ఇక తెలుగు విషయానికి వస్తే హలో సినిమా తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి కి ఆ సినిమా నిరాశనేమిగిల్చింది. ఈ సినిమా తరువాత ఈఏడాది సమ్మర్ లో విడుదలైన చిత్రలహరి తో విజయం దక్కించుకుంది అయితే ఇటీవల విడుదలైన రణరంగం పరాజయం చెందడం తో ప్రస్తుతం కళ్యాణి ప్రియదర్శన్ కు తెలుగులో ఆఫర్లు కరువైయ్యాయి.