ప్రగ్యా జైస్వాల్ కంచె దాటి చాలా కాలమే అయింది. అంటే ఆమె కంచె మూవీ రిలీజ్ అయి కొన్నేళ్ళు జరిగాయి అని అర్ధం. ఆమె తొలి మూవీలోనే క్యూట్ గా కనిపించి అహా అనిపించింది. గ్లామర్ బాగా కావాల్సిన టాలీవుడ్ కి కరెక్ట్  మెటీరియల్ మొత్తం ప్రగ్యా వద్ద ఉందని అంతా అనుకున్నారు. ఈ ముద్దు గుమ్మకు సరైన మూవీస్ చేతిలో పడితే ఎక్కడికో వెళ్ళిపోతుందని కూడా అనుకున్నారు.


సీన్ కట్ చేస్తే ప్రగ్యా ఎక్కడికీ వెళ్ళలేదు. అక్కడే ఉండిపోయింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసిన నమో వెంకటేశాయా మూవీలో ప్రగ్యాను శ్రుంగారం యాంగిల్లో  చూపించినా ఆ మూవీ ఫెయిల్ కావడంతో ఆఫర్లు రాలేదు. ఇక చిన్న హీరోల పక్కన నటించినా కూడా సక్సెస్ చూడని ఈ భామ ఇపుడు ఏం చేస్తుంది అంటే ఖాళీనే అంటున్నారు.


సైరా మూవీలో ఈ అమ్మడుకు ఒక పాత్ర ఉందని అంటున్నా సినిమా వచ్చేంత వరకూ తెలియదు. ఇక ఆ తరువాత మాత్రం చేతిలో సినిమాలే లేవు. దాంతో ప్రగ్యా సోషల్ మీడియానే గట్టిగా నమ్ముకుందట. ఇన్స్టాగ్రాం ద్వారా తన హాట్ పిక్స్ ని ఎప్పటికపుడు పెడుతూ కుర్ర కారు గుండెలను రంపం కోత కోస్తూ కసి తీర్చుకుంటోంది.


ఎంతలా కంచె దాటేసినా కూడా యూత్ గుండెల్లో కుంపటి పెడుతోంది తప్ప టాలీవుడ్ వాకిట మాత్రం అడుగు పెట్టలేకపోతోంది ఈ ముంబై  పోరి. దీంతో లేటేస్ట్ గా మరో అందాలా బాణాన్ని సంధించింది. తనలో ఏమున్నాయో చూసుకోండంటూ  కసిదీరా చాలెంజ్ చేసింది. ఇప్పటికైనా ప్రగ్యాకు చాన్సులు వస్తాయా. ఆమె అందాలా ఆరబోతను వెండి తెర మీదకు తెచ్చే నిర్మాతలు, దర్శకులు ఉన్నారా.. వేచి చూడాల్సిందే.   అపుడు ప్రగ్యా కసి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: