తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటికీ ఆరోవారం ముగిసింది. ఈసారి శనీ,ఆదివారాల్లో మంచి ఎంట్రటైన్ మెంట్ తో ముగిసింది. వాస్తవానికి ఈ వారం అక్కినేని నాగార్జున రావాల్సి ఉన్నా ఆయన స్పెయిన్ లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం వల్ల బిగ్ బాస్ కి గైర్హాజరయ్యారు. ఆయన స్థానంలో నటి రమ్యకృష్ణ ఎంట్రీ ఇవ్వడం..ఫల్ జోష్ నింపింది. శనివారం కాస్త మామూలుగా నడిచినా..ఆదివారం మాత్రం ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్ తో కడుపుబ్బా నవ్వులు పూయించారు. అయితే ఈసారి ఎలిమినేషన్ అన్న విషయంమాత్రం సస్పెన్స్ ఉంచారు.
ఆడియన్స్ మహేష్ ని కాపాడగా...పునర్నవి, హిమజా లను మాత్రం వినాయక చవితి సందర్భంగా సెఫ్ అయినట్లు చెప్పారు. ఇక బిగ్ బాస్ సీజన్ 3 ఏడో వారంలోకి ఎంటర్ అయింది. సోమవారం ఎపిసోడ్ లో వినాయకచవితి సంధర్భంగా హౌస్ మేట్స్ ఇంటిని డెకరేట్ చేసి వినాయకచవితి సంబరాలు జరుపుకున్నారు. ఆ తరువాత ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలుపెట్టిన బిగ్ బాస్ ఇద్దరు చొప్పున కన్ఫెషన్ రూమ్ లోకి పిలిపించారు. అయితే బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఇంటర్వ్యూ చేస్తూ.. నామినేషన్ ప్రక్రియను శిల్పా చక్రవర్తి పూర్తి చేసింది.
ఇక దీంతో ఇంటి సభ్యుల మనస్తత్వం ఏంటో.. వారికి ఎవరంటే నచ్చదు.. ఇలా ప్రతీ విషయం శిల్పాకు తెలిసింది. కన్ఫెషన్ రూమ్కు వెళ్లిన హౌస్మేట్స్.. ఆమెను కనిపెట్టడానికి ప్రయత్నించినా తెలుసుకోలేకపోయారు. నిజానికి వైల్డ్కార్డ్ ఎంట్రీ ద్వారా సోమవారం నటి ఈషా రెబ్బా వస్తారని ప్రచారం జరిగినా.. అకస్మాత్తుగా శిల్ప ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక నామినేషన్ ప్రక్రియ పూర్తైందని అనుకుంటూ లివింగ్ ఏరియాలో ఉన్న హౌస్మేట్స్ కి సర్ప్రైజ్ ఇస్తూ శిల్పా చక్రవర్తి ఇంట్లోకి ప్రవేశించింది.
ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. రెండు పేర్లను సూచించాలని శిల్పాను బిగ్బాస్ ఆదేశించాడు. ఇంతవరకు నామినేషన్ ఫేస్ చేయలేదని అలీని, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని శ్రీముఖిని నామినేట్ చేసింది. ఇక ఏడో వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్లో రాహుల్, మహేష్ విట్టా, రవి, అలీ, శ్రీముఖి ఐదుగురు ఉన్నారు.