మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ సైరా నరసింహారెడ్డి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, తమిళ నటుడు విజయ్ సేతుపతి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ స్టార్ కిచ్చ సుదీప్, టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి, వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాకు ప్రముఖ ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఫోటోగ్రఫీ ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుకను ఈనెల రెండవ వారంలో ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం. యూనిట్  సభ్యులు మరియు మెగా ఫ్యాన్స్ సమక్షంలో హైదరాబాద్ లో ఎంతో వైభవంగా జరుగనున్న ఈ వేడుకకు, టాలీవుడ్ కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు అతిథులుగా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇక ఈ వేడుకకు సంబంధించి మరికొద్దిరోజుల్లో సైరా టీమ్ నుండి ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం తదితర భాషల్లో కూడా సైరా విడుదలవుతుండటంతో, ఆయా బాషల నుండి కూడా పలువురు నటులను ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానించనున్నట్లు సమాచారం. మెగాస్టార్ తొలిసారి ఒక స్వతంత్ర సమరయోధుడి పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో, సైరాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలున్నాయి. దాదాపుగా రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: