ఒక టాప్ హీరో సినిమా పరాజయం పొందినప్పుడు సాధారణంగా ఆ మూవీ దర్శకుడు ఆ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లకు చింతిస్తూ అ టాప్ హీరో అభిమానులకు పరోక్షంగా క్షమార్పణలు చెపుతూ ఉంటారు. అంతేకాదు ఆ సినిమాను తీసి నష్టపోయిన నిర్మాతకు తాను మరొక సినిమా చేస్తానని భరోసా ఇవ్వడం కానీ లేకుంటే ఆ మూవీ బయ్యర్లకు ఎంతో కొంత నష్ట పరిహారం చెల్లిస్తామని చెపుతూ వారికి ధైర్యం కలిగిస్తూ ఉంటారు. 

అయితే తీరుకు భిన్నంగా ‘సాహో’ దర్శకుడు సుజిత్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. రిలీజ్ రోజు నుండి ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయిన సుజిత్ తన అజ్ఞాతవాసం వీడి ఈ సినిమా కోసం తాను ఎంత కష్టపడ్డాడో క్లారిటీ ఇచ్చాడు. ‘సాహో’ మూవీని చాలామంది చాల ఎక్కువగా ఊహించుకావడంతో ఈ మూవీ అంచనాలను అందుకోలేక పోయిందని అభిప్రాయ పడ్డాడు. 

అయితే ఈ సినిమాను ప్రేక్షకులు ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు రెండవసారి చూస్తే తాము ఈ మూవీలో చేసిన స్క్రీప్లీ ప్రయోగాలు అర్ధం అవుతాయని అందువల్ల అందర్నీ ఈరోజు నుండి ‘సాహో’ ను రెండవసారి చూడవలసిందిగా అభ్యర్ధనలు చేస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాను రెండవ సారి చూస్తే జనం ఈ మూవీని ఎంజాయ్ చేయడం ఖాయం అని అంటూ విచిత్ర అభ్యర్ధనలు చేస్తున్నాడు. 

ఇది చాలదు అన్నట్లు గా తన లైఫ్ జర్నీకి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ తన 17 సంవత్సరాలకే షార్ట్ ఫిలిం తీసానని చెపుతూ తన జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా తాను ఎప్పుడు ఓడిపోలేదు అంటూ కామెంట్స్ చేసాడు. తాను చేసిన తప్పుల నుండి తాను చాల నేర్చుకున్నాను అంటూ ‘సాహో’ మూవీని మరొకసారి చూడమని సుజిత్ చేసిన అభ్యర్ధన హాట్ టాపిక్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: