టాలీవుడ్ లోకి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా ‘బద్రి’సినిమాతో డైరెక్టర్ గా మారి తన సత్తా ఏంటో చూపించాడు పూరి జగన్నాథ్.  ఆ వెంటనే రవితేజ తో ‘ఇడియట్’ సినిమాతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీసిన ‘పోకిరి’ అప్పట్లో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది.  స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తీసిన పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ తో తీసిన ‘టెంపర్’ తర్వాత దారుణమైన డిజాస్టర్లు చవిచూశాడు.


ఒకదశలో పూరితో సినిమాలు తీయడానికి నిర్మాతలు కూడా భయపడ్డారు.  ఇదే సమయంలో ఓ బ్లాక్ బస్టర్ సినిమా తీయాలనే కసితో ఉన్న పూరికి అప్పటి వరకు దారుణమైన ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్ పోతిననే తోడయ్యాడు.  వీరిద్దరి కాంబినేషన్ లో ఛార్మీ నిర్మాతగా ‘ఇస్మార్ట్ శంకర్’ తెరకెక్కించారు.  ఈ సినిమా మాస్ హిట్ కావడమే కాదు..ఈ ఇద్దరి జాతకాలు మార్చాయి. ఇస్మార్ట్ శంకర్ తో పూరీ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ తెగ సంతోషాలు వ్యక్తం చేశారు.

'ఇస్మార్ట్ శంకర్' భారీ విజయం తర్వాత తన తదుపరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి పూరి సిద్ధమవుతున్నాడు. విజయ్ దేవరకొండతో తన తదుపరి సినిమాను ఆయన రూపొందించనున్నాడు. చార్మీతో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాడు. పూరి సినిమాల్లో ప్రత్యేకత ఒక్కటే యాక్షన్ తో పాటు ఆకట్టుకునే లవ్ స్టోరీ..ఇదే ఫార్ములాతో ఇప్పుడు విజయ్ దేవరకొండ తో సినిమాకు సిద్దమయ్యారు.

ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు షికారు చేశాయి. అదే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. అయితే ఈ మూవీ ఫస్ట్ లుక్ దసరాకు రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే హీరోయిన్లు, ఇతర తారాగణం గురించి త్వరలో అనౌన్స్ చేయబోతున్నట్లు టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: