రూపానికి ప్రతి రూపాన్ని తయారు చేస్తుంది మేడం టుస్సాడ్స్ మ్యూజియం . ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీల రూపాయలకి ప్రాణం పోసింది . ఈ మ్యూజియంలో తాయారు చేసిన స్టాచ్యూ పక్కన నిలబడితే ఎవరు నిజమైన మనిషి అని చెప్పటం చాలా కష్టంగా ఉంటుంది .ఇప్పటికే మన టాలీవుడ్ నుండి ప్రభాస్ మహేష్ లాంటి స్టార్లు ...తమ స్టాచ్యూ ని మ్యూజియం లో ఏర్పాటు చేయగా ...ఇప్పుడు తాజాగా ఓ అతిలోక సుందరి మేడం టుస్సాడ్స్ లోకి ప్రవేశించ బోతుంది .
బాల నటిగా తన నటనా ప్రస్థానాన్ని మొదలు పెట్టి ...అతిలోక సుందరిగా పేరు తెచ్చుకుంది అందాల తార శ్రీదేవి. తన నటనతో అందం తో తనకు ఎవ్వరు సాటి లేరు అని నిరూపించుకున్న గొప్ప నటి శ్రీదేవి. ఏ పాత్ర ఇచ్చిన ఆ పాత్రని ఆమె తప్ప వేరే వాళ్ళు చేయలేరు అనేంతగా నటనలో ఒదిగి పోయే తత్వం ఆమెది . భాషతో సంబంధం లేకుండా యావత్ భారత్ లో తనకంటూ ఓ పేజీ లికించుకుంది శ్రీదేవి. ఆమె చనిపోయి సంవత్సరం గడిచి నప్పటికీ ఆమె జ్ఞాపకాలు మాత్రం అభిమానులు మర్చిపోలేక పోతున్నారు .ఆమె లేని లోటుని అభిమానులకి ఎవరు పూడ్చలేకపోతున్నారు
కాగా శ్రీదేవి అభిమానులకి మేడం టుస్సాడ్స్ ఓ తీపి కబురు చెప్పింది . శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది . కళాకారుల రూపానికి సజీవ రూపాన్ని ఇచ్చే మేడం టుస్సాడ్స్ శ్రీదేవి మైనపు బొమ్మని ఏర్పాటు చేస్తుండటం తో శ్రీదేవి రూపాన్ని మళ్లీ సజీవంగా చూసుకోవచ్చని అభిమానులు సంతోషంలో మునిగిపోయారు .
సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ స్టూడియో లో శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్బంగా బోణి కపూర్ తన ట్విట్టర్ బావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు. శ్రీదేవి మా జ్ఞాపకాల్లో సజీవంగా ఉంటుంది. మా జ్ఞాపకాల్లో మాత్రమే కాదు, కోట్లాది మంది ప్రజల గుండెల్లోనూ ఆమె బతికే ఉంటుంది. ఆమె మైనపు విగ్రహాన్ని మేడమ్ టుసాడ్స్ బుధవారం విడుదల చేయనుంది. ఆ క్షణాల కోసం ఎంతో వేచి చూస్తున్నాం. శ్రీదేవి లివ్స్ ఆన్`` అంటూ బోణి కపూర్ ట్విట్ చేసాడు . కాగా దీనికి సంబందించిన ఓ వీడియో ని మేడం టుస్సాడ్స్ విడుదల చేసింది