ఏది ఏమైనా ఎవరు ఎన్ని చెప్పినా బిగ్ బాస్ సీజన్ 3 రోజు రోజుకు దిగజారిపోతోంది. మొదటి రెండు సీజన్స్ కంటే ఈ సీజన్ మరీ చెత్తగా తయారైంది. శ్రద్ధాదాస్ వస్తుందన్నారు. హెబ్బా పటేల్ పేరు కూడా గట్టిగా వినిపించింది. చివరి నిమిషంలో ఈషా రెబ్బా అంటూ అంతా ఫిక్స్ అయిపోయోలా చేశారు. చివరికి అసలు హీరోయినే లేకుండా చేశారు బిగ్ బాస్ నిర్వహకులు. కొన్ని రోజులుగా ఆసక్తిరకంగా మారిన వైల్డ్ కార్డ్ ఎంట్రీని నీరుగార్చారు. హీరోయిన్ వస్తుందనుకుంటే, ఆ స్థానంలో పాత యాంకర్ ని తీసుకు వచ్చారు. 
అస్సలు లైమ్ లైట్లో లేని యామక్ర శిల్పా చక్రవర్తి. ఆమె యాంకరింగ్ మానేసి కూడా చాలా కాలమైంది. ఒకటి అరా మాత్రమే శిల్పాకు అవకాశాలు వస్తున్నాయి. హాట్ హీరోయిన్ హౌజ్ లోకి వస్తుందనుకుంటే.. ఇలా ఫేడ్ అవుట్ యాంకర్ ను పంపించి అందరి ఉత్సాహాన్ని ఆవిరి చేశారు బిగ్ బాస్ నిర్వహకులు. 

దీనికి సంబంధించి హౌజ్ లో కూడా డిస్కషన్ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా శిల్పా చక్రవర్తిని పంపించే ముందు.. ఓ చీకటి గదిలో ఆమె ముఖం కనిపించకుండా, హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్లతో ఆమెను మాట్లాడించారు. ఆమె ఎవరా అనే అనుమానాన్ని చాలా మంది వ్యక్తంచేశారు. చివరికి బాబా భాస్కర్ అయితే, రెజీనా వచ్చినట్టుందని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు పాపం. అంటే కంటెస్టెంట్లు కూడా హీరోయిన్ వస్తుందని ఫిక్స్ అయిపోయారు. కానీ శిల్పా చక్రవర్తి రావడంతో.. ఇటు ప్రేక్షకులతో పాటు అటు కంటెస్టెంట్లు కూడా బాగా డిసప్పాయింట్ అయ్యారు.

వాస్తవంగా చెప్పాలంటే హౌజ్ లోకి హీరోయిన్ రాలేదని, శిల్పా చక్రవర్తి వచ్చిందనే విషయం చాలా మంది ప్రేక్షకులకు అర్థమైపోయింది. ఆమె వాయిస్ విన్న చాలామంది ఆ గొంతు శిల్పా చక్రవర్తిదే అని గుర్తించారు కూడా. దీంతో షో ఆసక్తికరంగా అనిపించలేదు. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్-3లో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా సో సో అనిపించింది. ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో హౌజ్ లోకి వచ్చిన ఏ ఒక్కరు కూడా షో కి హైప్ తేలేకపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: