మాస్ మహా రాజ రవితేజ కున్న మాస్ ఇమేజే వేరు. ఒకరకంగా రవితేజ లాంటి ఎనర్జిటిజ్ మాస్ హీరో ఇంకొకరు లేరేమోనని చెప్పాలి. అయితే గత కొంత కాలంగా ఈ మాస్ రాజకు మాంచి మాస్ హిట్ పడలేదు. వరుస ఫ్లాపులతో ఉన్న రవితేజ కు రాజా ది గ్రేట్ హిట్టివ్వగా ఆ తర్వాత మళ్ళీ రెండు సినిమాలు ఘోర పరాజయాన్ని చూశాయి. అయినా మాస్ రాజా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం వి.ఐ ఆనంద్ డైరెక్షన్ లో 'డిస్కో రాజా' సినిమా చేస్తున్న రవితేజ ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను ఫైనల్ చేసుకున్నాడట. నెక్స్ట్ గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'డాన్ శీను' మంచి మాసివ్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఎంటర్టైన్ మెంట్ ఉండే కథతోనే వీరిద్దరూ సినిమా చేయనున్నారట.

గోపిచంద్ తర్వాత సుధీర్ వర్మ డైరెక్షన్ లో రవితేజ సినిమా చేస్తాడని లేటెస్ట్ న్యూస్. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందని సమాచారం. వాస్తవంగా రవితేజ కోసమే 'రణరంగం' కథను రాసుకున్నాడు సుధీర్ వర్మ. కానీ అది అనుకోకుండా శర్వాతో చేయాల్సి వచ్చింది. శర్వాకున్న ఆసక్తి వల్లే రవి తేజ కూడా ఆ కథను వదులుకున్నాడు. అందుకే ఇప్పుడు మాస్ మహరాజ్ కోసం ఓ అదిరిపోయే మాస్ కథను సిద్ధం చేశాడట సుదీర్.

ప్రస్తుతానికి రవితేజ నెక్స్ట్ ఈ రెండు సినిమాలు కమిటయ్యాడాని అంటున్నారు. గోపిచంద్ మలినేని సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఇక సుధీర్ వర్మ సినిమా అనౌన్స్ చేయడం ఒకటే బ్యాలెన్స్. అది కూడా వచ్చేస్తే రెండూ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ప్రస్తుతం డిస్కో రాజా మీదే పూర్తిగా ఫోకస్ పెట్టిన రవితేజ త్వరలోనే గోపిచంద్ తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఇక డిస్కో రాజా లో రవితేజ తండ్రీ కొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నాడని తాజాగా వచ్చిన వార్తలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన ఆర్.ఎక్స్.100 హాట్ బ్యూటి పాయల్ రాజ్ పుత్, ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: