పివి సింధూ ఎన్నో సంవత్సరాలుగా కన్న కలలను ఇటీవలే నిజం చేసుకున్నది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆరుసార్లు ఫైనల్ కు వెళ్తే రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో .సాధించింది. ఇది నిజంగా గ్రేట్ అని చెప్పాలి. పట్టుదలతో ఆది గెలిచింది. మాములుగా ఫైనల్ కు వెళ్లడం అంటేనే గ్రేట్.. అలాంటిది ఆరుసార్లు ఫైనల్స్ కు వెళ్లడం అంటే మాములు విషయం కాదు. దాని వెనుక ఎంతటి కృషి ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.
ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల్లో విజయం సాధించిన సింధును భారత ప్రభుత్వం గౌరవించింది. తెలుగు రాష్ట్రప్రభుత్వాలు కూడా ఆమెను సముచితంగా గౌరవించాయి. ఇదిలా ఉంటె, సింధు జీవితం ఆధారంగా సినిమా చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. బయోపిక్ సినిమాలకు దేశంలో మంచి ఆదరణ ఉన్నది. అందులోను స్పోర్ట్స్ బయోపిక్ లకు మరింత ఆదరణ ఉన్నది.
స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన సినిమాలు చాలా వచ్చాయి.. సూపర్ హిట్టయ్యాయి. ఈ కోవలోనే పీవీ సింధు జీవితం ఆధారంగా సినిమా చేయడానికి కొందరు దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు. స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. పీవీ సింధు జాతీయ కావడంతో ఆ స్థాయిలోనే సినిమా తీయాలని అనుకుంటున్నారు. అందులో మెయిన్ రోల్ చేసేందుకు ఎవరిని తీసుకోవాలో అర్ధంకాని పరిస్థితుల్లో పడిపోయారు.
ఇప్పుడు సింధు బయోపిక్ లో నటించేందుకు ఇద్దరి నుంచి పోటీ వస్తున్నది. హీరోయిన్ సమంత కాగా, రెండోది నార్త్ హీరోయిన్ దీపికా పదుకొనె. విచిత్రం ఏమిటంటే ఇద్దరు పెళ్ళైన హీరోయిన్లే. ఇద్దరికీ మంచి పేరు ఉన్నది. పెళ్లి తరువాత ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. అటు దీపికా ప్రస్తుతం భర్త రణవీర్ సింగ్ తో కలిసి 83 సినిమా చేస్తున్నది. ఇటు సమంత భర్త చైతుతో కలిసి మజిలీ సినిమా చేసి హిట్ కొట్టింది. ఓ బేబీ సినిమాతో మరో హిట్ అందుకుంది. సో, ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.