మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై దాదాపుగా రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా సైరా నరసింహారెడ్డి. తొలితరం రేనాటి స్వాతంత్రోద్యమ వీరుడు నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తుండగా, ఆయన గురువు గోసయి వెంకన్న పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి, 

వీక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ అందించిన ఆ టీజర్ లో మెగాస్టార్ అద్బుతమైన పర్ఫార్మన్స్, డైలాగ్స్, బాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ వెరసి టీజర్ ను ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. ఇకపోతే బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీత సారద్యంలోని తొలి పాటను మరొక వారం రోజుల్లో యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఆ తరువాత ఒక్కొక్కటిగా పాటలను రిలీజ్ చేసి, ఆపై సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్వహించేలా ప్లాన్ చేశారట సినిమా యూనిట్. తెలుగుతో పాటు హింది, 

తమిళ్, మలయాళం, తదితర భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో, ప్రీ రిలీజ్ వేడుకకు ఆయా ఇతర భాషల నుండి కూడా కొందరు నటులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారట. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం డబ్బింగ్ తదితర నిర్మణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రముఖ ఛాయాగ్రహకుడు రత్నవేలు కెమెరా మ్యాన్ గా పనిచేస్తున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు సినిమా యూనిట్.... !! 


మరింత సమాచారం తెలుసుకోండి: