‘సాహో’ కు మొదటిరోజు మొదటి షో నుండి నెగిటివ్ టాక్ వచ్చినా ఆ టాక్ ను లెక్క చేయకుండా ఆ మూవీ మొదటి నాలురోజులకు 33o కోట్లు కలెక్ట్ చేయడం ఒక సంచలనం అయితే అంతకు మించిన సంచలనం మరొకటి జరిగింది.   ‘సాహో’ దెబ్బకు బాలీవుడ్ లో నిర్మాణం జరుపుకోవలిసిన 500 కోట్ల సినిమా ఆగిపోయింది అని వార్తలు వస్తున్నాయి. 

అత్యంత భారీ సినిమాల నిర్మాణానికి చిరునామాగా కొనసాగే బాలీవుడ్ లో ‘ధూమ్’ సిరీస్ లో భాగంగా ‘ధూమ్ 4’ తీయాలని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మూవీలో హీరోగా నటింపచేయడానికి సల్మాన్ ఖాన్ షారుఖ్ రణబీర్ కపూర్ లాంటి టాప్ స్టార్లతో ఇప్పటికే చర్చలు కూడ జరిపారు. ఈసినిమాకు సంబంధించిన కథ కూడ రెడీ అయినట్లు టాక్. 

విజయ్ కృష్ణ ఆచార్య ఈ మూవీ స్క్రీన్ ప్లే ఇప్పటికే వ్రాసి రెడీ పెట్టినా ఈ మూవీలో నటించడానికి ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోలు ఎవ్వరు ఆసక్తి కనపరచడం లేదనీ వార్తలు వస్తున్నాయి. దీనితో ఈమూవీ ప్రాజెక్ట్ ను ఆపేశారు అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. దీనికి కారణం ఈ మూవీ స్క్రీన్ ప్లే అచ్చు ‘సాహో’ స్క్రీన్ ప్లేలా ఉండటమే కాకుండా ఈ మూవీలోని చాల యాక్షన్ సీన్స్ ‘సాహో’ లోని యాక్షన్ సీన్స్ ను పోలి ఉంటాయని వార్తలు వస్తున్నాయి. 

దీనితో ముందు జాగ్రత్తగా ఈ మూవీ నిర్మాణ ఆలోచనలను విరమించుకున్నట్లు టాక్. ‘సాహో’ సక్సస్ కాకపోయినా ఆ మూవీ బాలీవుడ్ ఫీల్డ్ ను ఎలా ప్రభావితం చేసిందో ఈ న్యూస్ ను బట్టి అర్ధం అవుతుంది. ప్రభాస్ నేషనల్ స్టార్ కాదు అంటూ ప్రచారం చేసిన బాలీవుడ్ మీడియా ఇప్పుడు ‘సాహో’ ను గుర్తించ వలసిన పరిస్థితి ఏర్పడటం యాదృశ్చికం అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: