టాలీవుడ్ కామెడియన్లలో పద్మశ్రీ బ్రహ్మానందం గారికి ఉన్న క్రేజ్ వేరు, ఆయన ఏదైనా సినిమాలో అలా కనిపించారంటే చాలు, థియేటర్లు మొత్తం నవ్వుల పువ్వులతో దద్దరిల్లుతాయి. అయితే ఇటీవల కొంత అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన బ్రహ్మానందం గారికి హార్ట్ ప్రాబ్లెమ్ ఉందని, అందువలన ఆయనకు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని చెప్పడంతో, కొద్ధిరోజుల క్రితం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో ప్రముఖ డాక్టర్ల పర్యవేక్షణలో బ్రహ్మానందం గారికి హార్ట్ సర్జరీ జరిగింది. అయితే ఆ తరువాత కొన్నాళ్ళు ఇంటికే పరిమితం అయిన బ్రహ్మానందం గారు, 

ఇటీవల మళ్ళి సినిమాల్లో నటించడం మొదలెట్టారు. అయితే ఆయన ఇకపై ఆయన కొంత సెలెక్టీవ్ గా సినిమాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్, మరియు హరిష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వాల్మీకి సినిమాలో బ్రహ్మానందం గారు ఒక కామెడీ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే నేడు బ్రహ్మానందం గారితో కలిసి దర్శకుడు హరీష్ శంకర్ ఒక ఫోటో దిగి, దానిని తన సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్ లోడ్ చేయడం జరిగింది. వాల్మీకి చివరిరోజు షూటింగ్ లో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకున్నాయి. ఎందరికో ఈ అదృష్టం వస్తుంది, సినిమా కళామతల్లికి ఎంతో రుణపడి ఉంటాను అంటూ హరీష్ ఫోటోతో పాటు ఈ వాక్యాన్ని పోస్ట్ చేసారు. 

అయితే ఫొటోలో హరీష్ కు బ్రహ్మానందం గారు భోజనం వడ్డిస్తున్న సన్నివేశాన్ని చూడవచ్చు. కాసేపటి క్రితం బయటకు వచ్చిన ఈ ఫోటోను పలువులు నెటిజన్లు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్స్ మరియు లైక్స్ తో తెగ వైరల్ చేస్తున్నారు. వరుణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి, వీక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. 14రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: