సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఇంట్రో టీజర్ తరువాత ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

సూపర్ స్టార్ మహేష్ తొలిసారి ఆర్మీ మేజర్ గా అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే రెండు రోజుల క్రితం జరిగిన వినాయక చవితి పండుగ సందర్భంగా గోదావరి జిల్లా ప్రాంతంలో, ప్రత్యేకంగా సరిలేరు నీకెవ్వరు లో మహేష్ బాబు పోషిస్తున్న మేజర్ పాత్ర మాదిరిగా డ్రెస్ తో గణనాధుని తయారు చేయించి, కొందరు సూపర్ స్టార్ ఫ్యాన్స్ దానిని ఊరేగింపుగా తీసుకెళ్లడం జరిగింది. ఇక ఆ ప్రాంతంలోని వారందరూ ఆ విగ్రహాన్ని తదేకంగా చూడడం మొదలెట్టారు. ఇక వారు విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న సందర్భంగా కొందరు ఆ విగ్రహ వీడియోని తీసి సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది. 

నిన్నటి నుండి మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఆ వీడియోని నిర్మాత అనిల్ సుంకర తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఆ వీడియోకు ట్విట్టర్ లో మరింతగా షేర్స్, లైక్స్ దక్కుతున్నాయి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మురళి శర్మ, బండ్ల గణేష్, సంగీత, హరితేజ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. భరత్ అనే నేను, మహర్షి సినిమాల తరువాత వరుసగా మూడవ సారి మహేష్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు........!!

మరింత సమాచారం తెలుసుకోండి: