ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర సీమలో అగ్ర సంగీత దర్శకులుగా వెలుగొందుతున్న వారిలో ఎస్ఎస్ థమన్ కూడా ఒకరు. ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాయ్స్ సినిమాలోని నలుగురు కుర్రాళ్లలో ఒక కుర్రాడి పాత్రలో నటించిన థమన్, ఆ తరువాత సంగీత దర్సుకుడిగా మారారు. థమన్ తొలిసినిమా 2008లో తమిళ్ లో వచ్చిన సిన్ధనేయ్ సెయ్. ఇక తెలుగులో భీబత్సం, మళ్ళి మళ్ళి అనే సినిమాలకు తొలిసారి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన థమన్, అనంతరం రవితేజ మరియు సురేందర్ రెడ్డి కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ కిక్ తో మంచి గుర్తింపు సంపాదించాడు. 

ఇక అక్కడినుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందింపుచుకుని ముందుకు సాగుతున్న థమన్, మధ్యలో కొంత కాలం రిపీటెడ్ మ్యూజిక్ ఇస్తున్నాడు అంటూ విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అయితే ఇటీవల వరుసగా ఆయన నుండి వస్తున్న సినిమాలు మంచి మ్యూజికల్ హిట్స్ గా నిలుస్తుండటంతో, యూత్ ఎక్కువగా థమన్ మ్యూజిక్ కు కనెక్ట్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్  కాంబినేషన్లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో అనే సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. నిజానికి గతంలో బన్నీ నటించిన సూపర్ హిట్ సినిమాలైన రేస్ గుర్రం, సరైనోడు సినిమాల తరువాత, ఆయన తో ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమా మూడవది కావడంతో, ఎలాగైనా ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చి, వారిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడట. 

రేస్ గుర్రం, సరైనోడు సినిమాల్లో మాస్ సాంగ్స్ విపరీతంగా సక్సెస్ కావడంతో ఈ సినిమాలో కూడా అదరగొట్టే మాస్ సాంగ్ ఒకటి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నాలుగు సాంగ్స్ కంపోజ్ చేసిన థమన్, ఆ పాటల్లో అదరగొట్టే మ్యూజిక్ ఇచ్చాడట, ఇక ఈ సినిమా పాటల కోసం ప్రఖ్యాత వాయిద్య నిపుణుల సహకారాన్ని కూడా థమన్ తీసుకోవడం జరిగిందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలను బట్టి చూస్తుంటే, అల వైకుంఠపురములో సినిమాలో థమన్ అందించే సాంగ్స్ చాలావరకు అదిరిపోయే ఛాన్స్ కనపడుతోంది. మరి అదే కనుక జరిగితే బన్నీ ఫ్యాన్స్ కు పెద్ద పండుగే అని చెప్పాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: