మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా బిజీలో ఉన్నారు. షూటింగ్ వేగంగా జరుగుతున్నది. అప్పట్లో పూరి జగన్నాధ్ ఏ స్థాయిలో స్పీడ్ గా షూటింగ్ చేశారో.. అదే స్పీడ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మరో నెలరోజుల్లో షూటింగ్ ను ఫినిష్ చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
దీంతో వేగంగా షూట్ చేస్తున్నారు. రష్మీక మందన్న హీరోయిన్. ఇందులో విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటె, మహేష్ బాబు గురించి మరలా రూమర్లు జామ్ జామ్ అంటూ వస్తున్నాయి. మహేష్ బాబు త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియాలి. మహేష్ బాబు మాత్రం అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది.
ఇప్పటికే చాలాసార్లు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తనకు సినిమా తప్పించి మరో ప్రపంచం తెలియదని, సినిమానే లోకంగా ఉన్నానని, సినిమాల కోసం లైఫ్ ఉంటుంది తప్పించి మరో దాని గురించి ఆలోచించే ప్రసక్తి లేదని మహేష్ చెప్పారు. పదేపదే ఇదే విషయం గురించి మహేష్ ను ప్రతిసారి అడుగుతుండటంతో.పాపం మహేష్ కు కొత్తగా ఏం చెప్పాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాడు. మహేష్ సినిమాల విషయంలో ప్రస్తుతం చాలా కేర్ తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటె, మహేష్ బాబు ఈ సినిమా తరువాత నెక్స్ట్ చేయబోయే సినిమాపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. పరశురామ్ తో సినిమా కన్ఫర్మ్ అయ్యినట్టు సమాచారం. పరశురామ్ సూపర్ స్టోరీతో మహేష్ ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. పరశురామ్ తో పాటు చాలామంది దర్శకులు మహేష్ నెక్స్ట్ సినిమా కోసం రెడీ గా ఉన్నారు. మరి ఎవరి సినిమా కన్ఫర్మ్ అవుతుందో చూడాలి.