భారత్ బ్యాడ్మింటన్ ఖ్యాతిని  ఖండాతరాలకు వ్యాపింపజేసిన వ్యక్తి సింధు.  ఆరుసార్లు ఆమె బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు వెళ్తే మొదటిసారి 2019లో విజయం సాధించింది.  ఈ విజయంతో సింధు పేరు మారుమ్రోగిపోతున్నది.  కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు అందరూ ఆమెను మెచ్చుకున్నారు.  సత్కారాలు చేస్తున్నారు.  


ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చూపులు కూడా పీవీ సింధు వైపు ఉన్నాయి.  ఆమె జీవితం ఆధారంగా సినిమా చేయబోతున్నారు.  త్వరలోనే దీనికి సంబంధించిన న్యూస్ బయటకు వచ్చే అవకాశం ఉన్నది.  ఇందులో పీవీ సింధు  పాత్రలో ఎవరు చేస్తున్నారు అనే దానిపైనే ఇప్పటి వరకు ఓ అంచనాకు రాలేకపోతున్నారు.  సింధు ఆప్షన్ మాత్రం దీపికా వైపు ఉన్నది.  ఎందుకంటే దీపికా సినిమారంగంలోకి రాకముందు ఆమె బ్యాడ్మింటన్ ప్లేయర్.  


జాతీయ స్థాయిలో గేమ్స్ ఆడింది.  ఆమె తండ్రి ప్రకాష్ పాడుకొనే కూడా  బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడంతో దీపికాకు గేమ్ గురించి తెలుసు కాబట్టి ఆమైతే బెటర్అంటున్నది పీవీ సింధు.  అయితే, ఫైనల్ డెసిషన్ మాత్రం సినిమా డైరెక్టర్ చేతిలో ఉంటుందని, దానిని ఎవరూ కాదనలేరని అంటోంది.  సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది.  ఎవరు చేస్తున్నారు అనే విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి.  


దీపికా ప్రస్తుతం తన భర్త రణ్వీర్ సింగ్ తో కలిసి 83 సినిమాలో నటిస్తోంది.  కపిల్ దేవ్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది.  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఏప్రిల్ 2020 లో సినిమా రిలీజ్ అవుతున్నది.  దీంతోపాటు దీపికా మరికొన్ని సినిమాల కథలు వింటున్నట్టు సమాచారం.  పీవీ సింధు బయోపిక్ విషయంలో సౌత్ స్టార్ సమంత పేరు కూడా వినిపించింది. కానీ, సమంత ఇందుకు సమర్దురాలా కాదా అన్నది తెలియాల్సి ఉన్నది. స్పోర్ట్స్ స్టార్ మూవీ కాబట్టి సమంత కు అవకాశం దక్కకపోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: