భారీ అంచనాల మధ్య యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా ఇటీవల విడుదలైంది. విడుదలైన మొదటి షోకే సినిమాకి డివైడ్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమానులు పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారు. 'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ కచ్చితంగా హిట్ ఆ స్థాయిలో కొట్టాలని యాక్షన్ స్టోరీ ఉన్న ఈ కథను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే సినిమాలో విషయం లేకపోవడంతో స్క్రీన్ పై కూడా ప్రభాస్ లుక్ సరిగా లేకపోవడంతో...డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ పై అభిమానులు విమర్శలు చేశారు. అయితే సినిమాకి సంబంధించిన టాక్ ఈ విధంగానే ఉంటుందని విడుదలకు ముందే రాజమౌళి పసిగట్టినట్టు ఇటీవల ఆంగ్ల పత్రికలో ఒక కథనం ప్రచురితమైంది.


ఆంగ్ల పత్రికల్లో వస్తున్న కథనాల ప్రకారం విడుదలకు ముందే 'సాహో' చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ లో వీక్షించాడట. కొన్ని అనవసరమైన సన్నివేశాలని ఎడిటింగ్ లో తొలగించాలని ప్రభాస్ తో పాటు 'సాహో' చిత్ర యూనిట్ కు రాజమౌళి సూచించాడట. కానీ దర్శకుడు సుజీత్ తాను నమ్మిన స్క్రీన్ ప్లే ప్రకారం రాజమౌళి సూచనని పాటించలేదట. అంతేకాకుండా రాజమౌళి మరొక సూచన కూడా ప్రభాస్ కి ఇచ్చాడట.


అదేమిటంటే 'బాహుబలి' తర్వాత రెండు రొమాంటిక్ సినిమాలు చేయాలని ప్రభాస్ కి రాజమౌళి తెలపడంతో రాజమౌళి ఇచ్చిన సూచన కూడా పరిగణలోకి తీసుకోకుండా అప్పటికే ఒప్పుకున్న సుజిత్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ప్రభాస్ ఇచ్చేశాడట. అయితే 'సాహో' సినిమా మొత్తానికి ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవటంతో ప్రస్తుతం పూర్తి నిరుత్సాహంలో ఉండిపోయాడట ప్రభాస్. ప్రపంచ స్థాయిలో ఒక హిట్ సినిమా తర్వాత రెండేళ్లు 'సాహో' సినిమా కి సమయం కేటాయించి చివరాకరికి ఈ ఫలితం రావడంతో ప్రభాస్ ఈ సినిమా చేసి చాలా తప్పులు చేశారు అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు.



మరింత సమాచారం తెలుసుకోండి: