మహేష్ బాబు సినిమాలు చేస్తూనే వివిధ రకాల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. గత ఆరేళ్ళ నుంచి సంతూర్ సోప్ కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్. మహేష్ యాడ్ తీసినప్పటి నుంచి ఆ సోప్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. 30 సెకన్ల పాటు ఉండే ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్, కోలీవుడ్ లో ఈ బ్రాండ్ కు అంబాసిడర్ లు మారినా.... తెలుగులో మాత్రం మహేష్ బాబునే తీసుకున్నారు.
గత ఆరేళ్లుగా మహేష్ బాబు ఈయాడ్ చేస్తున్నారు. మహేష్ యాడ్ కు మంచి డిమాండ్ ఉన్నది. రెమ్యునరేషన్ కూడా భారీగా వస్తున్నది. సంతూర్ యాడ్ తో పాటు మహేష్ బాబు చాలా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఇలా అనేక రకాల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు.
ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరూ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నది. కొండారెడ్డి బురుజుకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 5 తేదీతో కొంత పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ తరువాత కీలక షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో మెహెష్ తో పాటు మిగతా నటీనటులు కూడా పాల్గొనబోతున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కాబోతున్నది. రష్మిక మందన్న హీరోయిన్. విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నది. ఇందులో మెహెష్ మేజర్ రోల్ చేస్తున్నారు. పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలా ఉంటుందనే విషయం తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఈ మూవీ తరువాత మహేష్ బాబు గీతగోవిందం దర్శకుడు పరశురామ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. కథ ఇప్పటికే ఒకే అయినట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి.