క‌ళాబంధు సుబ్బిరామిరెడ్డి ప్రతి ఏడాది త‌న పుట్టినరోజును చాలఘనంగా జరుపుకోవడమే కాకుండా ప్ర‌తి సంవ‌త్స‌రం తన పుట్టినరోజునాడు పెద్ద ఎత్తున తన పేరు మీద అవార్డులు ప్ర‌క‌టిస్తుంటారు. ఈ ఫంక్షన్ అత్యంత ఘనంగా జరిగే నేపధ్యంలో ఈ అవార్డ్స్ ఫంక్షన్ కు సంబంధించిన వార్తలు మీడియాకు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. 

 ప్ర‌ధానంగా ఈ ఫంక్షన్ లో ఇచ్చే అవార్డులు అన్ని ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ సెలెబ్రెటీల కుటుంబాలకు సుబ్బిరామిరెడ్డి ఇస్తున్న నేపధ్యంలో ఈ అవార్డ్స్ పై కొందరు సెటైర్లు కూడ వేస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలను ఆయన పట్టించుకోకుండా తన తరహాలో ఈ అవార్డ్స్ కార్యక్రమం కొనసాగిస్తూనే ఉన్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడ సుబ్బిరామిరెడ్డి ఈ నెల 17న విశాఖపట్నంలో టీఎస్ఆర్ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు.  

అయితే సాధారణంగా ప్రతి సంవత్సరం ఈ అవార్డ్స్ వేడుకకు ఆహ్వానించిన చాలమంది ఫిలిం సెలెబ్రెటీలు డుమ్మా కొడుతూ ఉంటారు. దీనితో ఈ సంవత్సరమైనా ఆహ్వానించిన ఫిలిం సెలెబ్రెటీలు ఈ కార్యక్రమానికి వస్తారో రారో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ విషయమై సుబ్బిరామిరెడ్డి కూడ తీవ్ర అసహనంలో ఉన్నట్లు టాక్. ఈ మధ్య జరిగిన ఒక సమావేశంలో సుబ్బిరామిరెడ్డి తన అసహనాన్ని ఓపెన్ గానే బయటపెట్టాడు. 

ఈసారి జరిగే వేడుకలలో జ‌య‌సుధ‌కు ‘అభిన‌య మ‌యూరి’ అనే అవార్డు ఇవ్వ‌బోతున్నార‌ట‌. తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు రెండూ నిధులు లేవంటూ నంది అవార్డుల్ని ప‌క్క‌న పెట్టేసిన నేపధ్యంలో సినిమా రంగం పై అభిమానులతో భారీ ఖర్చు పెట్టుకుని సుబ్బిరామిరెడ్డి ఇచ్చే అవార్డులకు ఈసారి అయినా ఫిలిం సెలెబ్రెటీలు అంతా వస్తారో రారో చూడాలి. ఫిలిం ఫేర్ అవార్డు ఫంక్షన్ గురించి శ్రద్ద చూపించే ఫిలిం సెలెబ్రెటీలు తెలుగు సంస్థలు అదేవిధంగా తెలుగు పత్రికలు ఇచ్చే అవార్డుల గురించి పట్టించుకోకపోవడం దురదృష్టం అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: