మహేష్ బాబు హీరోగా చేసిన చాలా సినిమా సూపర్ హిట్టయ్యాయి.  భారత అనే నేను, మహర్షి సినిమాలు సూపర్ హిట్.  అలానే అంతకు ముందు పోలీస్ ఆఫీసర్ గా చేసిన దూకుడు సినిమా భారీ హిట్టైంది.  ఈ సినిమాతో మహేష్ బాబు ఎక్కడికో వెళ్ళాడు.  అదే తరహా స్టోరీతో వచ్చిన ఆగడు సినిమా మాత్రం భారీ ఫెయిల్ అయ్యింది. ఆగడు సినిమా ఫెయిల్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి.  అది వేరే విషయం అనుకోండి.  


అసలు పాయింట్ ఏంటి అంటే.. ఓసారి మీడియా తెలంగాణా గవర్నర్ నరసింహాన్ గురించి సర్వాధికారి అనే పేరుతో వ్యాసం రాసింది.  ఆ వ్యాసం దాని ఫోటోచూసి షాక్ అయ్యాడట నరసింహన్. వ్యాసం బాగుంది.. కానీ, ఫోటోనే షాక్ ఇచ్చింది.  తాను ఎప్పుడూ యూనిఫామ్ వేసుకోలేదని, అలాంటిది తనను ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్ లో చూపించి వ్యాసం రాయడం భలే తమాషా అనిపించిందట. 

ఓ వేడుకలో నరసింహన్.. మహేష్ బాబులు కలిశారు.  ఆ సమయంలో మెహెష్ తో సరదాగా నీపై ఫోర్జరీ కేసు పెడతా అన్నారట.  దీంతో మహేష్ మొదట షాక్ అయ్యాడు.  అసలు విషయం తెలిసిన తరువాత పడీపడీ నవ్వుకున్నారట.  మహేష్ బాబు బాడీకి నరసింహన్ ఫోటోను యాడ్ చేసి వ్యాసం రాసారు.  మొదట్లో కోపం వచ్చిందని, కానీ, ఫోటో చూసిన తరువాత, రేపు తన మనవాళ్ళు మనవాళ్లకు ఆ ఫోటోను చూపించి గర్వంగా ఫీలవుతా అని గవర్నర్ ఓ సందర్భంలో పేర్కొన్నారు.  


ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నది.  రష్మిక మందన్న హీరోయిన్.  విజయశాంతి చాలా రోజుల తరువాత తిరిగి సినిమా రంగంలోకి అడుగుపెడుతుంది. అటు తెలంగాణా గవర్నర్ గా ఉన్న నరసింహన్ ఈనెల 10 వ తేదీన భాద్యతలను మరొకరి అప్పగించి సొంత రాష్ట్రానికిని వెళ్ళబోతున్నారు.  ఉమ్మడి రాష్ట్రంలోను, రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత కూడా నరసింహన్ గోవర్నర్ గా పనిచేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: