టుసాడ్స్ మ్యూజియంలో ఉంచిన అతిలోక సుందరి మైనపు విగ్రహం ఆమె అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది. శ్రీ దేవి విగ్రహాన్ని టుసాడ్స్ లో ఉంచుతున్నారని తెలియగానే అభిమానులు సంతోషంలో మునిగి తేలారు. ముమ్మూర్తులా మనిషిని పోలినట్టు వుండే విగ్రహాలను రూపొందించటం టుసాడ్స్ నిర్వాహకుల గొప్పతనం . ఇంతకు ముందు తయారు చేసిన సెలబ్రిటీల విగ్రహాలన్ని అలానే ఉన్నాయి. దీంతో శ్రీ దేవి విగ్రహం కూడా ఆమెలానే దేవతలా ఉంటుందని అందరూ అనుకున్నారు .


కానీ తీరా చూస్తే శ్రీదేవి అందానికీ ఆ విగ్రహానికి పోలికనే కనిపించటం లేదు. ఇది శ్రీదేవి మైనపు బొమ్మ అంటే నమ్మడం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే ఈ స్టాట్యూలో జగదేక సుందరి ఛాయలు ఎక్కువగా కనిపించటం లేదు . సింగపూర్ మేడమ్ టుసాడ్స్ లో శ్రీదేవి మైనపు బొమ్మను బోనీ కపూర్ పిల్లలతో కలిసి ఆవిష్కరించాడు. శ్రీ దేవి వ్యాక్స్ స్టాచ్యూ ఆమె లాగ లేకపోవటంతో అభిమానులే కాదు అందరూ ఫీలయ్యారు. మైనపు బొమ్మలను తయారు చేయడం మేడమ్ టుసాడ్స్ కు ఇవాళ కొత్తేమి కాదు.



మాధురి నుంచి మహేష్ బాబు వరకూ షారూక్ నుంచి ప్రియాంక వరకూ ఏ మైనపు బొమ్మ తయారు చేసినా అందులో ఫీచర్స్ కనిపించాయి. చిన్న చిన్న తేడాలు ఉన్నా ఒరిజినాలిటీ మిస్ కాలేదు . శ్రీ దేవి ఫీచర్స్ కుదరకపోవటానికి మేడమ్ టుసాడ్స్ నిర్వాహకులను తప్పుపట్టలేం ఎందుకంటే మహేష్ , ప్రియాంకా , షారుక్ ఖాన్ బతికుండగానే వాళ్ళ కొలతలు తీసుకుని వ్యాక్స్ స్టాచ్యూ తయారు చేశారు . శ్రీ దేవి లేకపోడంతో మిస్టర్ ఇండియా లోని హవా హవాయి పాట లో శ్రీదేవిని నమూనాగా తీసుకుని తయారు చేయడంతో లెక్క మారిందట దీంతో మైనపు బొమ్మలో శ్రీదేవి కనిపించడం లేదు .


మరింత సమాచారం తెలుసుకోండి: