పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘సూపర్’ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయిన నటి అనుష్క శెట్టి.  కెరీర్ బిగినింగ్ లో ఈ ముద్దుగుమ్మ యోగా టీచర్ కావడంతో మంచి ఫిజిక్ మెయింటేన్ చేసేది. దాంతో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన బాగా సెట్ అయ్యింది.  తెలుగు లో నెంబర్ వన్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించిన అనుష్క తర్వాత తమిళంలో కూడా తన సత్తా చాటింది.

  అక్కడ స్టార్ హీరోల సరసన నటించిన అనుష్క తెలుగు, తమిళ భాషల్లో నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది.  అనుష్క గ్లామర్ తరహా పాత్రల్లో నటించినప్పటికీ కొన్ని అంతగా ఎక్స్ పోజింగ్ మాత్రం చేసేది కాదు. ఇదే సమయంలో ఆమె అరుంధతి లాంటి లేడీఓరియెంటెడ్ సినిమాతో మరింత కీర్తిని ఆర్జించింది.  అప్పటి నుంచి అనుష్క నటించే ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉంటూ వచ్చింది. బాహుబలి లో డి గ్లామర్ రోల్ లో నటించిన అనుష్క బాహుబలి 2 లో యువరాణిగా అలరించి మంచి పేరు సంపాదించింది.

అయితే అనుష్క ‘సైజ్ జీరో’ సినిమా తర్వాత తన శరీరంలో ఎన్నో మార్పులు రావడం చాలా ఇబ్బందికరంగా మారంది. బాహుబలి 2 తర్వాత అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘భాగమతి’ లో నటించింది.  ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.  ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘నిశ్శబ్దం’ సినిమాలో నటిస్తుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' రూపొందుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆమె ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి రానున్న ఫస్టులుక్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నామని తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. ఈ మూవీలో మైఖేల్ మ్యాడ్సన్ అనే విదేశీ నటుడితో పాటు, మాధవన్, అంజలి, షాలినీ పాండే , సుబ్బరాజు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: