‘సాహో’ 350 కోట్లు వసూలు చేసినందుకు ఆనందం వ్యక్త పరుస్తూ ప్రభాస్ ఒక ప్రకటన ఇవ్వడమే కాకుండా తన అభిమానులందరికీ సింపుల్ గా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఒక ప్రకటన ఇచ్చాడు. అయితే ఇదే విషయాన్ని ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఈ విషయాలు చెపితే బాగుంటుంది అని ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ‘సాహో’ నిర్మాతలు ఎంత చెప్పినా ప్రభాస్ విననట్లు వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు ఈ మూవీ 350 కోట్లు కలెక్ట్ చేసినా ఈ మూవీ బయ్యర్లు నష్టాలు లేకుండా గట్టెక్కాలి అంటే ఇంకా చాల కలక్షన్స్ రావలసి ఉన్న నేపధ్యంలో ఈమూవీ రిలీజ్ తరువాత కొన్ని పోస్ట్ ప్రమోషన్ ఇంటర్వ్యూలను ‘సాహో’ గురించి ఇమ్మని ఈ మూవీ నిర్మాతలు ఎంత నచ్చ చెప్పినా ప్రభాస్ పట్టించుకొనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా గురించి ఒక స్పష్టమైన టాక్ వచ్చిన నేపధ్యంలో ఈ సినిమా గురించి పోస్ట్ ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎవరు పట్టించుకోరు అని ప్రభాస్ చాల స్పష్టంగా ఈ మూవీ నిర్మాతలకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ మూవీ విడుదలకు ముందు అత్యంత భారీ ప్రచారం చేసిన ప్రభాస్ ఈ మూవీకి వచ్చిన టాక్ కు బయటకు చెప్పకపోయినా బాగా షాక్ లో ఉన్నాడా అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో రోజురోజుకు పడిపోతున్న ‘సాహో’ కలక్షన్స్ చూసి బెంబేలు పడుతున్న బయ్యర్లకు ఎలా నచ్చచెప్పాలి అంటూ ఈ మూవీ నిర్మాతలు తల పట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా కృష్ణంరాజు ప్రభాస్ తో ఇప్పటికే జిల్ రాథాకృష్ణ దర్శకత్వంలో మొదలుపెట్టిన మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను వాస్తవానికి ఈ నెలాఖరు నుండి మొదలు పెట్టాలని భావించారు. అయితే ‘సాహో’ ఫలితం తరువాత మూడ్ ఆఫ్ లో ఉన్న ప్రభాస్ ఈ మూవీ షూటింగ్ విషయం గురించి తాను రెండు నెలల వరకు పట్టించుకొనని కొద్దిరోజులపాటు ఒంటరిగా ఉండటానికి ఒక అజ్ఞాత ప్రదేశంలోకి వెళ్ళిపోతానని ప్రభాస్ కృష్ణంరాజుకు చెపుతున్నట్లు గాసిప్పులు సందడి చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: