బాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రద్ధా కపూర్ 'సాహో' తో టాలీవుడ్ ఎంట్రీ ప్రయత్నాలు ఫెయిల్ కావడంతో ఆమెకు ఇప్పట్లో టాలీవుడ్ టాప్ హీరోల నుండి పిలుపు ఉండకపోవచ్చు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో అనూహ్యంగా ఈమె నటించిన బాలీవుడ్ మూవీ 'చిచోరే' ఈరోజు రిలీజ్ అవుతోంది.  ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ ఆమె కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. 

అయితే ఆ కామెంట్స్ ను ‘సాహో’ ప్రమోషన్ ను దృష్టిలో పెట్టుకుని చేసిందా అంటూ కొంతమంది సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఈమధ్య తాను నటించిన సినిమాల ప్రమోషన్ కోసం విపరీతంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు తిరిగాను అనిచేపుతూ ప్రస్తుతం తనకు సినిమా ప్రమోషన్ అంటే భయం వేస్తోంది అంటూ కామెంట్స్ చేసింది. అయితే ‘సాహో కోసం శ్రద్దా కపూర్ 4 కోట్ల భారీ పారితోషికం అంతకన్నా మించిన విలువైన బహుమతులు ప్రభాస్ వల్ల శ్రద్దా కపూర్ పొదింది. మరి అలాంటి సినిమాకు ఆమె పడ్డ కష్టం ఎందుకు విరక్తి కలిగించింది అన్నది సమాధానం లేని ప్రశ్న. 

దీనితో ‘సాహో’ నెగిటివ్ రిజల్ట్ ను దృష్టిలో పెట్టుకుని ప్రమోషన్ లో కష్టపడినా ఫలితం లేకుండా పోయింది అన్న విషయాన్ని శ్రద్ధా కపూర్ ఇలా పరోక్షంగా చెప్పిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.  ఈరోజు దేశ వ్యాప్తంగా విడుదల అవుతున్న ‘చిచోరే’ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. 

‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు.దీనితో చిన్న సినిమాగా విడుదల అవుతున్న ఈమూవీ ఊహించని హిట్ అందుకుంటుదా అన్న అంచనాలు వస్తున్నాయి. 300 కోట్ల ‘సాహో’ సాధించలేని విజయం ‘చిచోరే’ సాధిస్తే ఇండియన్ ఫిలిం ప్రేక్షకుల అభిరుచి ఎలా మారిపోయిందో అర్ధం అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: