సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు దీపం ఉండగాన ఇల్లు చక్కదిద్దుకోవాలని చూస్తుంటారు.  పాత తరం నటీమణులు తమ నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ దర్శక, నిర్మాతలచే షెభాష్ అనిపించుకుంటూ ఎన్నో ఛాన్సులు దక్కించుకున్నారు.  కానీ ఈతరం హీరోయిన్ల పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.  ఎంత గ్లామర్ ప్రదర్శన చేస్తే అంత డిమాండ్..విచ్చలవిడి శృంగార పాత్రల్లో నటిస్తే అంత క్రేజ్.  అయితే ఇలాంటి హీరోయిన్లకు ఎక్కువ లైఫ్ కూడా ఉండదు..మహా అంటే నాలుగు ఐదు సినిమాల్లో నటించారంటే మహా గొప్ప.

అయితే కొంతమంది నటీమణులు తమ అందాలతో పాటు అభినయాన్ని కూడా జత చేయడం వల్లనే పదేళ్ల పాటు సినీ పరిశ్రమలో ప్రయాణం చేస్తూ వస్తున్నారు. అలాంటి వారిలో నయన్, కాజల్, త్రిష, అనుష్క..ఇలా కొంత మంది నటీమణులు.  ఇక హెబ్బా పటేల్ 2014లో వచ్చిన తిరుమనం ఎనుం నిఖా మూవీద్వారా తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది.  2014లో వచ్చిన అలా ఎలా? అనే మూవీ  ద్వారా తెలుగు తెరకు పరిచయమైనా, 2015లో వచ్చిన కుమారి 21ఎఫ్ హెబ్బా పటేల్ కు గుర్తింపునిచ్చింది.

ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా పెద్దగా హిట్ మాత్రం సాధించలేక పోయింది. అందాలు ఒలకబోయడానికి ప్రయత్నించినా, ఎంచుకున్న కథల్లో విషయం లేకపోవడం వలన వెనుకబడిపోయింది. తాజాగా ఆమె మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అయితే ఈ సారి ఆమె ఓకే చెప్పింది హీరోయిన్ రోల్ కోసం కాదు.. విలన్ పాత్ర కోసం.

ఇటీవల కొంత మంది హీరోయిన్లు విలన్ పాత్రల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా 'భీష్మ' రూపొందుతోంది. ఈ సినిమాలో నితిన్ సరసన నాయికగా రష్మిక మందన నటిస్తోంది. ఈ మూవీలో నెగిటీవ్ పాత్ర ఒకటుందని హెబ్బాకు చెప్పగా పాత్ర చాలా బాగుందని వెంటనే ఒప్పేసుకుందట.  నెగెటివ్ షేడ్స్ కలిగిన ఈ పాత్రలో హెబ్బా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: