ఈనెల 20న విడుదల కాబోతున్న ‘వాల్మీకి’ మూవీతో తిరిగి హారీష్ శంకర్ డైరెక్టర్ గా ట్రాక్ లోకి వస్తాడు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగార్తాండ’ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ మూవీని హరీష్ శంకర్ చాల బాగా తీసాడు అంటూ ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ కాపీ చూసిన వాళ్ళు చెపుతున్నారు.  

ఇలాంటి సందర్భంలో ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ మూవీలో నితిన్ ఒక అతిథి పాత్రను చేస్తున్నాడు. ఇతడి పాత్ర ఈ మూవీ క్లైమాక్స్ దగ్గర వస్తుందని తెలుస్తోంది. దర్శకుడు హరీష్ శంకర్ కు నితిన్ కు ఉన్న సాన్నిహిత్యం రీత్యా నితిన్ ఈ మూవీలో అతిది పాత్రను చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఇది చాలదు అన్నట్లుగా ఈ మూవీలో మరొక అతిథి పాత్రను క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ పోషించినట్లు కూడ వార్తలు వస్తున్నాయి. సుకుమార్ హరీష్ శంకర్ లు కూడ మంచి స్నేహితులు అన్న విషయం ఓపెన్ సీక్రెట్ దీనితో ఇద్దరు టాప్ సెలెబ్రెటీలు ‘వాల్మీకి’ కోసం సహకరించడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

వాస్తవానికి ఈ మూవీని నాని ‘గ్యాంగ్ లీడర్’ తో పోటీగా విడుదల చేయాలి అని భావించినా రెండు మీడియం రేంజ్ సినిమాల మధ్య పోటీ మంచిది కాదు అన్న ఉద్దేశ్యంతో ‘వాల్మీకి’ వెనక్కు జరిగింది. ఇప్పటికే ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం వరుణ్ స్టామినాకు సంకేతంగా మారింది. అక్టోబర్ 2న ‘సైరా’ విడుదల అయ్యే వరకు మరి ఏ భారీ సినిమా పోటీ పడకపోవడంతో వరుణ్ తేజ్ కు కలిసొచ్చిన అదృష్టం అనుకోవాలి..    
 


మరింత సమాచారం తెలుసుకోండి: