రాజకీయాల తర్వాత 'ఖైదీ నెంబర్ 150' సినిమా తో రి ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో నిరూపించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' సినిమా తో మరొకసారి దేశవ్యాప్తంగా తన స్టామినా ఏంటో నిరూపించడానికి రెడీ అయ్యారు. ఇటువంటి నేపథ్యంలో తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి మరియు సౌత్ ఇండస్ట్రీకి చెందిన బడా నటీనటులను పెట్టుకొని సినిమాపై హైప్ తీసుకురావడం జరిగింది. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను చేస్తున్నారు.


చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. అయితే సినిమా తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో విషయంలో అదిరిపోయే స్ట్రాటజీ తో నిర్మాత రామ్ చరణ్ అదిరిపోయే ప్లాన్ వేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 15 లేదా 17న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా కర్నూల్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.


అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పవన్ కళ్యాణ్ తో పాటు రజిని కాంత్ ని గెస్టులుగా పిలవనున్నారని సమాచారం. తెలుగు రాష్ట్రాలతో పాటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడానికి రామ్ చరణ్ ప్లాన్ వేసినట్టు ఇండస్ట్రీలో వినపడుతున్న టాక్. ఇదే క్రమంలో మెగా అభిమానులు కూడా సినిమా కోసం ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రంగస్థలం సినిమా తర్వాత మెగా కాంపౌండ్ నుండి సరైన హీరో సినిమా రాకపోవడంతో చిరంజీవి సినిమా పై చాలా అంచనాలు పెట్టుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: