వరుస పరాజయాలతో కొనసాగుతున్న కూడా యంగ్ హీరో నితిన్ నటించే  సినిమాల శాటిలైట్ హక్కులను  దక్కించుకోవడానికి  ప్రముఖ చానెళ్లు ఆసక్తి చూపిస్తున్నాయి.  అందులో భాగంగా నితిన్ నటిస్తున్న భీష్మ అలాగే   చంద్రశేఖర్ యేలేటి తో చేయనున్న సినిమాల యొక్క  శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ సొంతం చేసుకోగా డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ దక్కించుకుంది.  అయితే ఈ హక్కులను ఏంత మొత్తానికి  సొంతం చేసుకుందో  తెలియాల్సి వుంది. 







కాగా  నితిన్ ప్రస్తుతం భీష్మ  షూటింగ్ లో పాల్గొంటున్నాడు.  'ఛలో' ఫేమ్  వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో  కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటిస్తుండగా   మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.  రొమాంటిక్ ఎంటర్ టైనర్ నేపథ్యంలో ప్రముఖ  చిత్ర నిర్మాణ సంస్థ  సితార ఎంటర్టైన్మెంట్స్  నిర్మిస్తున్న ఈచిత్రం  క్రిస్మస్ కు విడుదలకానుంది. ఈ సినిమాతో పాటు నితిన్ ప్రస్తుతం తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి  డైరెక్షన్ లో 'రంగే దే' సినిమాలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో  కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది.  ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. 







ఇక  చంద్రశేఖర్ యేలేటి తో చేయనున్న సినిమాను ఈఏడాది చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు  నితిన్.  భవ్య క్రియేషన్స్ నిర్మించనున్న  ఈ చిత్రంలో  రకుల్ ప్రీత్ సింగ్ , మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్  హీరోయిన్లుగా నటించనున్నారు. ప్రియా ప్రకాష్ కు తెలుగులో ఇదే మొదటి సినిమా. మరి ఈ మూడు సినిమాల తో  హిట్లు కొట్టినితిన్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: