సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న రత్నవేలు సౌత్ ఇండియాలో టాప్ డైరెక్టర్ల కి ఎంతో సుపరిచితుడు. డైరెక్టర్ శంకర్ మరియు  టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ సినిమాలకు ఎక్కువ పనిచేసిన రత్నవేలు ప్రస్తుతం డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘సైరా’ సినిమా కి పని చేయడం జరిగింది. అయితే ఈ సినిమా త్వరలో విడుదల కాబోతున్న నేపధ్యంలో ఇటీవల చిరంజీవి పుట్టినరోజు నాడు సినిమాకి సంబంధించి టీజర్ విడుదల చేసి అభిమానులకు సినిమాపై అంచనాలను పెంచేశారు సినిమా యూనిట్. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పోరాట యోధుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.


ఇటువంటి నేపథ్యంలో తాజాగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు... డైరెక్టర్ శంకర్ సినిమాలకు పని చేయడంతో పని తనం లో చాలా మార్పులు వచ్చాయి అని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో అలవాటు పడ్డారని చెప్పుకొచ్చారు. శంకర్ 20 రోజులు ఏకధాటిగా షూటింగ్ చేస్తారని.. తర్వాత ఓ పదిరోజులు బ్రేక్ ఇస్తారని చెప్పాడు.   అయితే 'సైరా' కోసం కంటిన్యూగా పనిచేయాల్సి వచిందని.. వర్క్ ఎక్కువ కావడంతో కొన్నిసార్లు సెట్ లో కొప్పడ్డానని ఓపెన్ గా చెప్పారు.


అయితే తనను ఎవరూ ప్రెజర్ పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి లాంటి స్టార్ హీరో మరియు భారీ బడ్జెట్ సినిమా కావడంతో అవుట్ పుట్ హ్యాండిల్ చేయడంలో చాలా శ్రద్ధ తీసుకున్నాం అని క్వాలిటీ కోసం ఎక్కడా రాజీ పడలేదని ఇందుమూలంగా నే ఎక్కువ కోపం వచ్చిందని చెప్పుకొచ్చారు రత్నవేలు. అంతేకాకుండా వివి వినాయక్ తో చిరంజీవి గారు చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా తో చిరంజీవి గారికి రామ్ చరణ్ కి నాకు మధ్య మంచి సన్నిహిత సంబంధం ఏర్పడింది కాబట్టి ఈ సినిమాలో ఎక్కువ శ్రద్ధ చూపించడం జరిగిందని చెప్పుకొచ్చారు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.  



మరింత సమాచారం తెలుసుకోండి: