సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా వచ్చిన ఈ సినిమాను శంకర్ డైరెక్ట్ చేశారు. సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. లాస్ట్ ఇయర్ ఎన్నో భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా చైనాలో రిలీజ్ అవలేదు.


ఈ సినిమా రిలీజ్ టైంకు వేరే సినిమాలు భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న కారణంగా చైనాలో 2.ఓ రిలీజ్ చేయలేదు. సెప్టెంబర్ 6 శుక్రవారం అంటే ఈరోజు చైనాలో 2.ఓ గ్రాండ్ రిలీజ్ చేశారు. దాదాపు చైనాలో 48,000 స్క్రీన్స్ లో 2.ఓ రిలీజ్ చేశారని తెలుస్తుంది. శంకర్ డైరెక్ట్ చేసిన రోబో సినిమా చైనాలో సూపర్ హిట్ అయ్యింది. 


ఇప్పుడు రోబో మ్యాజిక్ ను దానికి సీక్వల్ గా వచ్చిన 2.ఓ కూడా రిపీట్ చేస్తుందని భావిస్తున్నారు. 2.ఓ సినిమా ఇండియా మార్కెట్ లోనే దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అంతకుముందు వచ్చిన బాహుబలి రికార్డులను సైతం తిరగ రాస్తుందని భావించారు. కాని సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల నష్టాలే తెచ్చింది.  


అయితే చైనా లో రజిని సినిమాల మార్కెట్ బాగుంటుంది. తప్పకుండా 2.ఓ అక్కడ విజయ దుందుంభి మోగిస్తుందని అంటున్నారు. సినిమాలో ఏమీ జాక్సన్ హీరోయిన్ గా నటించగా ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా తర్వాత శంకర్ తన తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టలేదు. ప్రస్తుతం శంకర్ కథా చర్చలు జరుపుతున్నారట. విజయ్ తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. రజిని మాత్రం మురుగదాస్ తో దర్బార్ సినిమా చేస్తున్నాడు.       



మరింత సమాచారం తెలుసుకోండి: