ప్రభాస్ కి బాహుబలి తో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ హీరో ఒక్కసారిగా ఇంతగా ప్రపంచం మొత్తం ఫేమస్ అవడం ప్రభాస్ కే సాధ్యమైంది. అంత భారీ బడ్జెట్ సినిమా తర్వాత వచ్చిన మరో భారీ బడ్జెట్ తో మల్టి లాంగ్వేజెస్ లో తెరకెక్కించిన సినిమా సాహో. 350 కోట్ల తో  ఈ సినిమాను రూపొందించారు. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవమున్న సుజీత్ దర్శకత్వంతో వచ్చిన ఈ సినిమాకి ఊహించలేనంత క్రేజ్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచే వచ్చింది. ఇక ఇంత భారీ ప్రాజెక్ట్ గతవారం రికార్డు స్థాయి థియేటర్లలో భారీఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ రోజు నుండి థియేటర్లు తగ్గబోతున్నాయి. ఇప్పటికే వసూళ్లు తగ్గి ఇబ్బంది పడుతున్న ఈ సినిమాకు ఈ శుక్రవారం  నుంచి ఇదొక ఎదురుదెబ్బగా మారబోతోంది. ఎందుకంటే ఈవారం ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటికి థియేటర్లు కేటాయించే క్రమంలో చాలా సెంటర్ల నుంచి సాహో మూవీ తీసేశారు. 

ఈవారం రిలీజ్ అవుతున్న వాటిలో పెద్ద సినిమాలేం లేవు. అన్నీ చిన్న సినిమాలే. అయినప్పటికీ థియేటర్లు మాత్రం కేటాయించాల్సిందే. ఇప్పుడదే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సాహో నడుస్తున్న థియేటర్ల నుంచి దాదాపు 30 శాతం థియేటర్లలోకి ఇప్పుడీ 7 సినిమాలు వచ్చాయి. వీటిలో ఎన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటాయనే విషయాన్ని అటుంచితే.. ఆ మేరకు సాహో వసూళ్లు మాత్రం బాగా తగ్గబోతున్నాయనేది అందరికి తెలిసిన వాస్తవం. ఇక ఈవారం థియేటర్లలోకి వచ్చి సందడి చేయబోతున్న

సినిమా విషయానికొస్తే..ఆ 7 సినిమాల్లో "జోడీ" మాత్రమే కాస్త అందరికీ పరిచయం ఉన్న సినిమా. ఎందుకంటే ఇందులో ఆది సాయికుమార్ హీరోగా నటించాడు. 
జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటించింది. మిగతా సినిమాల్లో చెప్పుకోదగ్గ స్టార్ కాస్ట్ ఎవరూ లేరు. వీటిలో ఉండిపోరాదే, దర్పణం, 2 అవర్స్ లవ్, నీకోసం లాంటి చిన్న సినిమాలున్నాయి. అంతేకాదు ఈ వారం మరో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో జీవా, నయనతార నటించిన వీడే సరైనోడు అనే సినిమా కాగా ఈ సినిమాతో పాటు ఆండ్రియా, అంజలి నటించిన తారామణి అనే సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. మరి స్ట్రైట్ సినిమాలతో పాటు ఈ డబ్బింగ్ సినిమాలలో ఏది హిట్టవుతుందో ఏది ఫట్టవుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: