మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి, ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాను కర్నూలుకు చెందిన స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. 1850 ల నేపథ్యంలో సాగె ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫీ ని అందిస్తుండగా, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా జతకడుతున్న ఈ సినిమాలో నరసింహారెడ్డి గురువైన గోసాయి వెంకన్న పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తుండగా, 

టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ నటుడు సుదీప్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక అతి త్వరలో ఈ సినిమాలోని తొలి పాట ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుక డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఆ సమాచారం ప్రకారం, ఆ వేడుకను ఈనెల 15వ తేదీన కర్నూలులో ఎంతో వైభవంగా జరుపనున్నారట. ఇక ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ అవుతుండడంతో, హిందీ నుండి అమితాబ్, తమిళ్ నుండి రజినికాంత్, 

అలానే మలయాళం నుండి మోహన్ లాల్ తదితరులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించనున్నారట. అంతేకాక ఈ వేడుకకు టాలీవుడ్ కు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు కూడా ప్రత్యేకంగా హాజరు కాబోతున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఈ వేడుక కోసం కర్నూల్ లో ఏర్పాట్లు మొదలెట్టడం జరిగిందని టాక్. అయితే ఈ వేడుకకు సంబంధించిన పూర్తి సమాచారం మరికొద్దిరోజుల్లో మీడియాకు తెలియపరచనుందట సైరా యూనిట్. మరి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నట్లుగా ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తేలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపికపట్టాల్సిందే.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: