బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో సల్మాన్ ఎన్నో కేసులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కృష్ణ జింక కేసు, హిట్ అండ్ రన్ కేసు తెలిసిందే. కొంత మంది జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. తాజాగా తనని తీవ్రంగా కొట్టారని ఆరోపిస్తున్నాడు అశోక్ పాండే కోర్టు మెట్టెక్కారు. తాను సైకిల్ పై వెళుతుండగా సల్మాన్ కనిపిస్తే ఫోటోలు- వీడియోలు తీశాడు. అందుకు సల్మాన్ బాడీ గార్డులు అనుమతించారు. అయితే ఆ టైమ్ లో వీడియోలు తీయడం నచ్చని సల్మాన్ తన వద్దకు వచ్చి ఫోన్ లాక్కుని కొట్టారు.
ఈ విషయంపై అంధేరి- డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ప్రయత్నిస్తే అక్కడ పోలీసులు కేసు నమోదు చేయలేదని సల్మాన్ ఖాన్ పెద్ద హీరోకావడం వల్ల ఇష్యూ వస్తుందని వారు భావించి కేసు నమోదు చేసుకునే విషయంలో వెనక్కి తగ్గారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వల్ల తనకు న్యాయం జరగకపోవడం వల్లనే ఇప్పుడు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెబుతున్నాడు. అయితే ఈ సంఘటన ఏప్రిల్ 24న జరిగిన ఈ ఘటన గురించి చాలా ఆలస్యంగా వివరాలు వెల్లడయ్యాయి. ఈ వివాదంలో సల్మాన్ తో పాటు అతడి గార్డులు ఆ యువకుడిని చితక్కొట్టారట.
ప్రస్తుతం ముంబై అంధేరీ కోర్టు ఈ కంప్లైంట్ ను స్వీకరించి పోలీసులను విచారించాల్సిందిగా ఆదేశించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే నిజంగానే సల్మాన్ కొట్టారా? అంధేరి పోలీసులు సల్మాన్ కి వత్తాసు పలుకుతూ సదరు జర్నలిస్ట్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించలేదా? అన్నది తేలాల్సి ఉంది. సదరు జర్నలిస్టుని గాయపరిచినందుకు ఐపీసీ సెక్షన్ 323, ఫోన్ లాక్కున్నందుకు 392.. ఉద్ధేశపూరిత నేరపూరిత చర్యకు పాల్పడినందున ఐపీసీ 506 కింద కోర్టులో సల్మాన్ పై కేసులు నమోదు చేసారు. కేసు నమోదు చేయని పోలీసులకు శిక్ష తప్పదని చెబుతున్నారు. ఇందులో వాస్తవాలేంటో విచారణలో తేలాల్సి ఉంది.