బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి బ్యాడ్ బాయ్ గా పేరుంది. ఆయనకి వివాదాలు, కోర్టు కేసులు కొత్తేమి కాదు.గతంలో జింకను వేటాడిన కేసు, ఫుట్ పాత్ పై పడుకున్న వారిపై కారును ఎక్కించిన కేసు  సంవత్సరల నుండి  కోర్టులో కొనసాగుతున్నాయి. ప్రస్తుత విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ మరియు అతని బాడీగార్డులు తనని తీవ్రంగా కొట్టి, తన ఫోన్ లాక్కున్నారని అశోక్ పాండ్ అనే జర్నలిస్ట్ ఆరోపిస్తున్నాడు.
.
ఏప్రీల్ 24 తేదిన సల్మాన్ ఖాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ముంబాయి వీధుల్లో సైకిల్ పై తిరుగుతున్నాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న అశోక్ పాండ్ సల్మాన్ ఖాన్ ఫోటోలను తీయడం మొదలుపెట్టారు. అశోక్ ఫోటోలు తీయడానికి ముందు సల్మాన్ బాడీగార్డులను పర్మిషన్ అడిగాడు. వాళ్లు ఒప్పుకోవడంతో ఫోటోలు మరియు వీడియో తీయడం మొదలుపెట్టాడు. కానీ సల్మాన్ ఖాన్ కు ఫోటోలు తీయడం నచ్చలేదు, కోపంతో  అశోక్ దగ్గరికి వచ్చి ఫోన్ తీసుకున్నాడు. తరువాత ఆయన బాడీ గార్దులు అశోక్ ను కొట్టడం మొదలుపెట్టారు. కొంచెం సేపు తర్వాత సల్మాన్ ఖాన్ కూడా వచ్చి కొట్టడం మొదలుపెట్టాడు.

ఈ విషయంపై అంధేరి- డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ప్రయత్నిస్తే అక్కడ పోలీసులు కేసు నమోదు చేయలేదని .. పెద్ద స్టార్ అవ్వడం వల్ల పోలీసులు వెనకాడారని ఆరోపించాడు. పోలీసుల వల్ల తనకు న్యాయం జరగకపోవడం వల్లనే ఇప్పుడు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెబుతున్నాడు.ఈ కేసుపై  విచారణ జరిపి సెప్టంబర్ 14 న పూర్తి వివరాలు కోర్టు కు అందించాలని అంధేరి- డీఎన్ నగర్ పోలీసులని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో దోషిగా తేలితే సల్మాన్ కు శిక్ష తప్పదు.


ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ను చేస్తున్నాడు. ఈ సినిమా పేరు " ఇన్షాఅల్లా". ఇందులో బాలీవుడ్ అందాల తార ఆలియా భట్ హీరోయిన్ గా నటింస్తుంది.  కొన్ని రోజుల క్రితం  అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.ఇన్షాఅల్లా శాటిలైట్ రైట్స్ 190 కోట్లకు అమ్ముడుపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: