గోవా బ్యూటి ఇలియనా  గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తుంది. మొదట ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో పేమలో మునిగితేలింది.కొన్ని రోజుల కింద వారిద్దరు ఇంస్టాగ్రామ్ నుండి ఒకరిని ఒకరు అన్ ఫాలో అయ్యారు. ఇలియనా ఆండ్రూ నీబోన్ తో కలిసి ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ తోలిగించింది.దీంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్త  సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానీ బ్రేకప్ పై ఇలియనా, ఆండ్రూ నీబోన్ లు  ఎలాంటి సమాధానం చెప్పలేదు. 


ఇలియనా ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఆశ్చర్యపరుస్తుంది.అవును. మన జీవితంలో స్నేహితులను.. కుటుంబ సభ్యులను.. జీవితం భాగస్వాములను కోల్పోయే సందర్భాలు వస్తాయి.  అయితే మన జీవితంనుండి ఎవరు వెళ్ళిపోయినా మనల్ని మనం మాత్రం కోల్పోకూడదు.  లైఫ్ లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే.. మనల్ని మనచుట్టూ ఉండేవారు ప్రేమించడం లేదని మనకు తెలిసినప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవాలి.. మనకు మనమే తోడుగా నిలవాలి" అంటూ ఒక ఫిలాసఫీ చెబుతుంది. అయితే చివర్లో ఉన్న వాక్యన్ని చూస్తే ఆండ్రూ నీబోన్ ఇలియనాను సరిగా ప్రేమించలేదా అనే అనుమానాలు చాలా మందికి వస్తున్నాయి.ఈ పోస్ట్ ను బట్టి ఇలియనా అతని ఆలోచన నుండి బయటికి రావడానికి చాలా కష్టపడుతుందని అర్థమవుతుంది.


ప్రస్తుతం ఇలియనా కెరియర్ సరిచేసుకునే పనిలో ఉంది. తెలుగులో హీరోయిన్ గా నటించిన చివరి సినిమా అమర్ అక్బర్ అంథోని. ఈ సినిమా ద్వారా తెలుగులో మళ్లీ బిజి అవుదాం అనుకుంది కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత చిరంజీవి నటించే సినిమాలో హీరోయిన్ గా ఇలియనాను  పరిశీలిస్తున్నారని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినబడుతున్నాయి. ప్రస్తుతం అనీస్ బాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పాగల్ పంటి' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా నవంబర్ లో విడుదల కానుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: