బిగ్ బాస్ 3 తెలుగు లో ఏడోవారానికి చేరుకుంది.  ఇప్పటికే దిగ్విజయంగా ఆరువారాలు పూర్తి చేసుకొని ఏడోవారం నడుస్తుది. అయితే  గత ఆరువారాల్లో బిగ్ బాస్ లో ఎలాంటి రచ్చ జరగలేదు. కాకపోతే ఇంటి సభ్యుల మద్య చిన్న చిన్న తగాదాలు.. టాస్క్ పరంగా విభేదాలు మాత్రమే వచ్చాయి.  అప్పుడప్పుడు మాటల యుద్దాలు..మ్యాన్ హ్యండ్ లింగ్ వరకు వెళ్లాయి..కానీ వెంటనే తాము బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పరంగానే ఇలా చేస్తున్నామని చెప్పుకోవడంతో అందరి మద్య సామరస్యత నెలకొంటుంది. 

అయితే ఈ మద్య కాస్త గ్రూప్ లు కడుతున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్.  ఇంట్లో ఈసారి బాబా భాస్కర్ కెప్టెన్ అయిన విషయం తెలిసిందే. ఆయన కొన్ని రూల్స్ పెట్టారు..ఆ రూల్స్ ప్రకారం ఆడవాళ్లకు స్వేచ్చ ఉంటుంది. అవసరమైతే మీ పనులు చేను చేస్తాను కానీ ఈ వారం రోజులు మాత్రం నన్ను డ్యామేజ్ చేయొద్దని ఇంటి సభ్యులకు బాబా భాస్కర్ విన్నవించుకున్నారు. ఇలా సాగుతున్న బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఒక్కసారే కన్నీటి పర్యంతం అయ్యారు కొంతమంది ఇంటి సభ్యులు.

దానికి కారణం బిగ్ బాస్ కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి సందేశాలు వచ్చాయి. తమవారు పంపించిన లేఖలు చూసుకుని హౌస్ మేట్స్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. శివజ్యోతి, రవికృష్ణ, వితిక, బాబా భాస్కర్ తదితరులు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.  గతంతో ఫోన్ సంభాషనలతో ఇంట్లో సభ్యులు ఒక్కొక్కరూ మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో నిన్న వచ్చిన లేఖలు చూసి అందరూ ఆవేదన చెందారు..తమ వాళ్లను గుర్తు తెచ్చుకొని ఏడ్చారు.మొత్తానికి శుక్రవారం ఎపిసోడ్ కు బిగ్ బాస్ కాస్తంత ఎమోషనల్ టచ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: