విశ్వనటుడు కమల్ హాసన్ గారాలపట్టి శ్రుతి హాసన్ టాలీవుడ్లో కొత్త  మూవీకి రెడీ అవుతున్నట్లుగా సినీ వర్గాల సమాచారం. శ్రుతి హాసన్ తెలుగులో చివరిగా చేసిన చిత్రం కాటమరాయుడు. ఈ మూవీలో పవన్ తో జోడీ కట్టిన ఈ అమ్మడు ఆ తరువాత మళ్ళీ ఈ వైపు చూడలేదు. మధ్యలో ఆమె పర్సనల్ లైఫ్ వల్ల కొంత గ్యాప్ వచ్చింది.


ఇపుడు మళ్ళీ రెట్టించిన జోరుతో హుషార్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు శ్రుతి రెడీ అవుతోంది. ఆమె రవితేజా పక్కన బలుపు అనే మూవీ లో జోడీ కట్టింది. దానికి గోపి మలినేని డైరెక్టర్. ఇపుడు ఈ ముగ్గురి కాంబోలో మళ్ళీ మూవీ వస్తోందట. అంటే రవితేజాతో కలసి శ్రుతి తెలుగులో మళ్ళీ కనిపించనుందన్నమాట.


ఇదిలా ఉండగా శ్రుతి హాసన్ నటిగానే కాకుండా గాయకురాలిగా కూడా తన సత్తా చాటిన సంగతి విధితమే. ఆమెకు దర్శకత్వం వైపు కూడా చూపు ఉన్న సంగతీ తెలిందే. అందం అభినయం పుష్కలంగా ఉన్న శ్రుతి రైట్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకుని టాలీవుడ్ నుంచి తప్పుకుందని అంతా అంటారు. ఆమెకు గబ్బర్ సింగ్ మూవీతో స్టార్ స్టాట‌స్ వచ్చేసింది.


అదే వూపులో వరసగా మూవీస్ చేసుకుంటూ వెళ్తో శ్రుతికి బాగా ఉండేది. ఈ పాటికి ఆమె టాప్ పొజిషన్లో కూడా ఉండేది. కానీ నాడు నో అన్న శ్రుతి ఇపుడు రీ ఎంట్రీ ఇస్తోంది. అది కూడా రవితేజాతో. ఆయనకు ఇపుడు సరైన హిట్లు లేవు. మరి బలుపు వీరిద్దరికీ సక్సెస్ ఇచ్చింది. అలాగే మళ్ళీ ఇద్దరూ పెద్ద హిట్ కొట్టి టాలీవుడ్ రేసులో ముందుకు వస్తారా అన్నది చూడాలి మరి. సో. వైట్ అండ్ సీ..



మరింత సమాచారం తెలుసుకోండి: