ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలిన అందాల భామలు తర్వాత తలో దారిలో వెళ్లిపోయారు.  ఒకరు రాజకీయాల్లోకి..మరొకరు బాలీవుడ్ లోకి..తెలుగు అభిమానులు మళ్లీ వారిని వెండి తెరపై చూస్తామా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఒకప్పటి టాప్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు.  అత్త, అమ్మ,అమ్మమ్మ ల పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు.  సుహాసిని, నదియా,రమ్యకృష్ణ, కుష్బు ఇలా కొంత మంది హీయిన్లు మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. 

ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లో ఉన్న నటి లేడీ అమితాబచ్చన్ విజయశాంతి హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే రాజకీయాలవైపు మొగ్గు చూపింది. మొదట బీజేపీ తర్వాత టీఆర్ఎస్...ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఆమెతో సినిమాల్లో నటింపజేయాలని ఎంతో మంది దర్శక, నిర్మాతలు ప్రయత్నించినా కుదరలేదు. కానీ మొదటిసారిగా అనీల్ రావిపూడి అభ్యర్థన మేరకు మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తుంది. 

విజయశాంతి చాలా కాలం తర్వాత వెండి తెరపై కనిపించబోతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. కీలకమైన పాత్రలో ఆమె కనిపించబోతున్నారు. ఇక కూలీ నెం.1 సినిమాలో తన అందాలతో మంత్రముగ్దులను చేసింది టబు.  ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం టబు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ ‘అలా వైకుంఠపురము’ సినిమాలో టబు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమా సందడి కనిపిస్తుంది.

అయితే ఈసారి ఒకప్పటి టాప్ హీరోయిన్ల మద్య పోటీ నెలకొంది. ఈ ఇద్దరు హీరోయిన్లు నటించి ఏ మూవీ హిట్ అవుతుంది..బ్లాక్ బస్టర్ అవుతుందో సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: