మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. నా పేరు సూర్య వంటిది దారుణమైన డిజాస్టర్ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఈ సినిమా చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ కావడంతో ‘అల వైకుంఠపురములో’. సినిమాతో హ్యాట్రిక్ కొట్టే ఆలోచనలో ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.


ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ‘అల వైకుంఠపురములో’ సినిమాకి సంబంధించిన స్టోరీ. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు... జయరాం, మురళి శర్మ లలో ఒకరిది కోటిశ్వరుడు కుటుంబం, మరొకటి లో మిడిల్ క్లాస్ కుటుంబం. వాళ్లిద్దరికి సోషల్ స్టేటస్ లో కానీ, ఎకనామిక్ స్టేటస్ లో కానీ పోలిక ఉండదు. జయరామ్ ,టబులకు అల్లు అర్జున్ పుడతాడు. పుట్టుకతోనే కోటిశ్వరుడు. మరో ప్రక్క వాళ్ల కారు డ్రైవర్ మురళి శర్మ కు సుశాంత్ పుడతాడు. వీళ్లిద్దరి పుట్టుక ఒకే సారి జరుగుతుంది. జయరాం, మురళి శర్మ  ఇద్దరూ స్నేహితుల్లా మెలుగుతారు.


ఈ క్రమంలో వాళ్ల పిల్లల భవిష్యత్ గురించి ఓ డిస్కషన్ వస్తుంది. కారు డ్రైవర్ కొడుకు మళ్లీ కారు డ్రైవర్ అవుతాడు కోటీశ్వరులు కొడుకు మళ్లీ కోటీశ్వరుడు అవుతాడు అని మురళి శర్మ జైరాంతో వాదిస్తాడు. అయితే జయరాం అలాంటిదేం లేదు వాళ్ల పుట్టుక వాళ్ల భవిష్యత్తును తేల్చదు...వారిలో ఉండే కష్టపడే తత్వం వారి భవిష్యత్తును నిర్ణయిస్తుందని అంటాడు జయరాం. అయితే అదే సందర్భంలో ఒకేసారి వీరిద్దరికీ పిల్లలు పుట్టడంతో అదే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో కోటేశ్వరుడు -కారు డ్రైవర్ అయిన ఇద్దరు స్నేహితులు ఒకరి పిల్లలని ఒకరి దగ్గర పెంచుకుంటారు మూడో కంటికి తెలియకుండా. ఇంతకీ ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా స్టోరీ అని ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈ సినిమా హిట్ అయితే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ పడినట్లే. 



మరింత సమాచారం తెలుసుకోండి: