ఎన్టీఆర్ బయోపిక్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవలే తన కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ తో ప్రస్తుతం బాలయ్య తన 105 వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం బ్యాకాంక్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈషెడ్యూల్ లో కేజీఎఫ్ ఫైట్ మాస్టర్లు అన్బు -అరివి ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవుతుందట. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన బాలకృష్ణ స్టైలిష్ స్టిల్స్ కు సూసూపర్ రెస్పాస్ వచ్చింది. ఇక ఈచిత్రం కోసం ఏకంగా 30కోట్ల బడ్జెట్ ను పెడుతున్నాడు నిర్మాత సి కళ్యాణ్.
బాలయ్య మార్కెట్ పరంగా చూసుకుంటే ఇది భారీ బడ్జెటే. అయితే సి కళ్యాణ్ రిస్క్ చేయడానికి కారణం లేకపోలేదు. గతంలో ఇదే కాంభినేషన్ లో వచ్చిన జై సింహ యావరేజ్ టాక్ ను తెచుకున్న కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది. దాంతో కేఎస్ రవికుమార్ - బాలయ్య జోడి మీద భారీగా ఖర్చు పెడుతున్నాడు. ఒకవేళ సినిమా కు హిట్ టాక్ వస్తే ఈ మొత్తాన్ని రాబట్టడం పెద్దగా కష్టమేమి కాకపోవచ్చు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రంలో బాలయ్య కు జోడిగా సోనాల్ చౌహన్ , వేదిక నటిస్తుండగా వీరితో పాటు సీనియర్ నటి భూమిక చావ్లా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. బాలీవుడ్ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కి విడుదలకానుంది.