మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సైరా సినిమా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  దక్షిణాది నాలుగు భాషలు, హిందీలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సినిమా కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  


ఇప్పటికే రిలీజైన టీజర్ అదరగొట్టింది.  టీజర్ సూపర్ హిట్ కావడంతో మెగా అభిమానులంతా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈనెల 15 వ తేదీ నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి.  ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదని సైరా టీం అంటోంది.  ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ఇప్పటికే పూర్తయింది.  తమిళ్ వెర్షన్ డబ్బింగ్ చెప్పాలి.  


తమిళ్ వెర్షన్ లో మెగాస్టార్ కు ఎవరు డబ్బింగ్ చెప్తున్నారు అనే దానిపై మొన్నటి వరకు ఊహాగానాలు ఉన్నాయి.  ఫైనల్ గా ఎవరు చెప్పబోతున్నారు అనే దానిపై క్లారిటీ వచ్చింది.  మెగాస్టార్ కు తమిళ్ హీరో, దృవ విలన్ అరవింద్ స్వామీ డబ్బింగ్ చెప్పబోతున్నారట.  ఆ విషయం ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.  అరవింద్ స్వామీ స్వయంగా చరణ్ కు ఫోన్ చేసి మెగాస్టార్ కు డబ్బింగ్ చెప్పే అవకాశం ఇవ్వాలని కోరాడు.  


అందుకే చరణ్ కూడా ఒకే చెప్పారట.   అటు మెగాస్టార్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో తమిళ్ వెర్షన్ కు అరవింద్ స్వామీ డబ్బింగ్ చెప్తారని స్పష్టం అయ్యింది.  తమిళ్ వెర్షన్ కు అరవింద్ స్వామీ డబ్బింగ్ చెప్పడం వలన సినిమాకు ప్లస్ అవుతుందని యూనిట్ నమ్మకంగా ఉన్నది.  ఇక ఈనెల 15 వ తేదీన జరిగే సైరా వేడుకకు సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిధిగా వస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: