రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ భారీ సినిమాల సందడి నెలకొంది. ఇటువంటి నేపథ్యంలో ఒక పక్క నిర్మాతగా వ్యవహరిస్తూ మరోపక్క హీరోగా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ రాబోయే సంక్రాంతికి ప్రస్తుతం చేస్తున్న కుటుంబ కథా చిత్రాన్ని విడుదల చేయడానికి డిసైడ్ అయిపోయారు.సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో చేస్తున్న ఎంత మంచి వాడవురా అనే సినిమా రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విడుదల చేయటానికి కళ్యాణ్ రామ్ డిసైడ్ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి.


అయితే సంక్రాంతి సినిమా విడుదల విషయంలో ఈ సినిమా నిర్మాతలు కొంత జంకుతున్నట్లు సమాచారం. ఎందుకంటే రాబోయే సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న 'అలా వైకుంటపురం లో' అనే సినిమా విడుదల కానుంది ఇదే తరుణంలో రెండు వరుస ఇండస్ట్రీ హిట్ లతో మంచి జోరు మీద ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విడుదల కాబోతుంది.


ఇటువంటి తరుణంలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్న గ్రామంలో నేపథ్యంలో ఎంతమంచి వాడవురా సినిమా నిర్మాతలు సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుందని కళ్యాణ్ రామ్ కి చెప్పినట్లు ఫిలింనగర్లో టాక్. అయితే కళ్యాణ్ రామ్ మాత్రం అనుకున్న టైమ్ కి సంక్రాంతి సినిమా విడుదల అవుతుందని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కళ్యాణ్ రామ్ సినిమా నిర్మాతలకు చెప్పినట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ అంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి గల కారణం సినిమా స్టోరీ అని ఖచ్చితంగా సంక్రాంతి సినిమా రిలీజ్ అవ్వాలి ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదని దర్శకనిర్మాతలకు సూచించారట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ గోదావరి పరిసర ప్రాంతాల్లో చాలాసార్లు వేగంగా సాగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: