మెగా స్టార్ చిరంజీవి  నటించిన  ప్రతిష్టాత్మక చిత్రం సైరా నర్సింహా రెడ్డి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. ఇటీవలవిడుదలైన ఈ చిత్రం యొక్క  టీజర్  ఆసక్తికరంగా ఉండి సినిమా ఫై మరింత గా అంచనాలు పెంచేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ ను కూడా  విడుదలచేయనున్నారు. అందులో భాగంగా  ఈ ట్రైలర్ ను కట్ చేయడం కూడా జరిగిపోయింది. ఫిలిం నగర్ వర్గాల నుండి వస్తున్న  సమాచారం ప్రకారం హై  క్వాలిటీ విజువల్స్ తో  సూపర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సైరా ట్రైలర్  థ్రిల్ చేయనుందని సమాచారం. అలాగే ట్రైలర్ లో  సినిమా మెయిన్  స్టోరీ లైన్ ను కూడా రివీల్ చేయనున్నారట. 



ఈట్రైలర్ ను  ఈనెల 15 న విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్.  ఇక  ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నూల్ లో భారీ ఎత్తున్న నిర్వహించనున్నారు.   సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈపీరియాడికల్ మూవీ లో  అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , రవికిషన్ , జగపతి బాబు ,  సుధీప్ , నయనతార , తమన్నా  ముఖ్య పాత్రల్లో నటించగా  బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తునాడు. 



భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న సౌత్ తో పాటు హిందీలోనూ విడుదలకానుంది ఈ చిత్రం.  ఇక సాహో తరువాత  తెలుగు నుండి వస్తున్న  భారీ సినిమా కావడం తో  సైరా ఫై  దేశ వ్యాప్తంగా  అంచనాలు  ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: