వాతావరణ మార్పుల వల్లనో లేకుంటే ‘సాహో’ షాక్ వల్లనో సుజిత్ అనారోగ్యంతో హాస్పటల్ లో చేరాడు అంటూ ఇండస్ట్రీ వార్తలు హడావిడి చేస్తున్నాయి. ‘సాహో’ విడుదలైన మరుసటి రోజు నుండి సుజిత్ బయట కనిపించక పోవడంతో సుజిత్ ‘సాహో’ షాక్ తో గోవా వెళ్ళిపోయాడు అంటూ పుకార్లు గుప్పు మన్నాయి. 

అయితే సుజిత్ అజ్ఞాతవాసానికి అసలు కారణం వేరు అంటూ ఇప్పుడు మరొక వార్తలు హడావిడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం సుజిత్ హాస్పటల్ లో చేరినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు సుజిత్ కు డెంగీ జ్వరం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

వాస్తావానికి ‘సాహో’ విడుదలకు ముందే తరుచూ సుజిత్ కు జ్వరం వస్తున్నా ‘సాహో’ పనుల ఒత్తిడి వల్ల ఆ విషయాలను పెద్దగా శ్రద్ధ పెట్టలేదని టాక్. అయితే ‘సాహో షాక్ తో పాటు తన అనారోగ్య సమస్యలు పెరిగి పోవడంతో సుజిత్ హాస్పటల్ కు వెళ్లి చెక్ చేయించుకుంటే అతడికి రక్తంలో ప్లేట్స్ కౌంట్ కూడా తగ్గిపోయిందని దీనితో ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించడంతో ప్రస్తుతం సుజిత్ ఒక ప్రముఖ కార్పోరేట్ హాస్పటల్ లో వైద్యం చేయించుకుంటున్నట్లు టాక్. సుజిత్ బాగోగులనుచ అతడి తల్లి దగ్గర ఉండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

దీనికితోడు సుజిత్ పై ‘సాహో’ విడుదల తరువాత జరిగిన మాటల దాడి కూడ సుజిత్ ను మానసికంగా కొంత షాక్ కు గురిచేసినట్లు సమాచారం. తాను పూర్తిగా కోలుకున్న తరువాత తన దగ్గర ఇప్పటికే రెడీ పెట్టుకున్న ఒక వినూత్నమైన వెరైటీ కథను సినిమాగా తీసే ఆలోచనలో సుజిత్ ఉన్నట్లు తలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో సుజిత్ ను నమ్మి ఏ నిర్మాత లేదంటే ఏ హీరో సాహసం చేస్తాడు అన్నదే సందేహం..



మరింత సమాచారం తెలుసుకోండి: