సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన మాలీవుడ్ భామ నయనతార తర్వాత సూర్య నటించిన గజిని సినిమాలో హాట్ హాట్ గా దర్శనమిచ్చింది.  నయనతార అదృష్టం బాగా కలిసి రావడంతో తెలుగు, తమిళ స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకుంది.  ఇలా నయన్ నటించిన ప్రతి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ బ్యూటీ అప్పట్లో గోల్డెన్ లెగ్ గా పిలిచారు.  తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటిస్తూ నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది నయనతార. 

టాప్ హీరోయిన్లలో నయన్ కి ప్రత్యేక స్థానం ఉంది.  కొంత కాలంగా  హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటిస్తూ మంచి పేరు సంపాదించింది.  దక్షిణాదిన ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ నయనతార.  ప్రస్తుతం నయన్ తమిళంలో సూపర్ స్టార్ రజినీ నటిస్తున్న ‘దర్భార్’ మూవీలో నటిస్తుంది. తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా మూవీలో నటిస్తుంది.  దాదాపు 250కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.


ఈ మూవీకి కొణిదెల రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  తాజాగా సైరాలో నయన్ రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో కొత్త రూమర్లు పుట్టుకొస్తున్నాయి.  ఈ సినిమా కోసం నయన్ సౌత్ ఇండియాలోనే అందరి హీరోయిన్స్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా 6కోట్లకు పైగా అందుకున్నట్లు టాక్. 

ఒక మీడియం హీరో కంటే హై రేంజ్ లో నయనతారకు రెమ్యునరేషన్ చెప్పొచ్చు.  నయన్ పై రూమర్స్ ఎన్ని ఉన్నా ప్రమోషన్స్ కి రాకపోయినా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. నయనతార ఒక పాత్రకు సెట్టవుతుంది అంటే నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా ఆమెను ఫిక్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా అదృష్టం అంటే నయన్ దే అని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: