ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిలో పడుతున్న బిగ్బాస్ సీజన్-3 లో మరొక సంచలనం చోటు చేసుకుంది. గత వారం ఎలిమినేషన్ ప్రక్రియ జరపని బిగ్ బాస్ ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన శిల్పా చక్రవర్తి తో కొత్త పద్ధతిలో నామినేషన్ జరిపిన సంగతి తెలిసిందే.ఏడవ వారం అయిన ఈ సీజన్ లో నామినేషన్ లో ఉన్నవారు వితిక, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, మహేష్ మరియు అలీ రెజా. సీజన్ మొదలైనప్పటి నుంచి ఒక్కసారి కూడా నామినేషన్ల లో లేని అలీ దురదృష్టవశాత్తు ఈ వారం మొట్టమొదటిసారి నామినేట్ అయ్యాడు. చివరికి ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్లబోయే ఇంటి సభ్యుడు కూడా అతనే.

అసలు నామినేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు అలీ రెజాను ఎలాంటి కారణాంతో నామినేట్ చేశారు అన్నది తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ అయిన శిల్పా చక్రవర్తి వచ్చీరాగానే ఇప్పటి వరకు నామినేషన్లలో లేడు కాబట్టి అలీకి నామినేషన్స్ రుచి ఎలా ఉంటుందో చూపించాలి అని తనని చేస్తున్నట్లు చెప్పి చివరికి అతనిని పాతాళం లోకి నెట్టేసింది. సరే తనంటే కొత్తగా వచ్చింది ఏం తెలియదు అనుకుందాం కానీ మిగతా ఇంటి సభ్యులు కూడా అలీ రెజాను అదే కారణంతో నామినేట్ చేయడం అలీ దురదృష్టమనే చెప్పాలి. 

అయితే అతని వైపు కూడా చాలా తప్పులు ఉండనే ఉన్నాయి. ఎప్పుడూ టాస్క్ విషయంలో అది చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. టాస్కుల్లో తన బలాన్ని నమ్ముకున్నాడే తప్ప ఏ రోజు బ్రెయిన్ వాడింది లేదు. ఇక కేవలం టస్కుల్లో తప్ప మిగతా సభ్యులతో సరిగ్గా కలవడం లేదా ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకోవడం వంటివి ఎన్నడూ చేయలేదు. ఇక ఎంటర్టైన్మెంట్ గురించి అయితే మాట్లాడు కోవడం మంచిది. ప్రేక్షకులు అతనిని మెచ్చుకోకపోవడానికి ప్రధాన కారణం అతను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకవడమే. చివరికి అతని కోపమే తనకు శత్రువు అయి ఇంటి నుండి బయటకు వెళ్లేలా చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: