తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదివరకటితో పోలిస్తే హీరోలు మరియు హీరోయిన్ల మధ్య ఒకింత ఆరోగ్యకరమైన పోటీ కనపడుతోంది అనడానికి ఇటీవల కొన్ని ఆడియో మరియు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక స్టార్ హీరోలు,  ఎటువంటి భేషిజం లేకుండా ఒకరి ఫంక్షన్ కు మరొకరు హాజరై అభిమానుల మనసులు గెలుస్తున్నారు. అంతేకాక మరికొందరు స్టార్ హీరోలైతే, అక్కడక్కడ కొన్ని చిన్న సినిమాల ఫంక్షన్స్ కు హాజరవుతూ, తమ వంతుగా వారి సినిమాలకు సాయం అందిస్తుండడం విశేషం. అయితే ఇటీవల చాలా ఫంక్షన్స్ లో మన హీరోలు సందడి చేసినప్పటికీ, దాదాపుగా అందరూ హీరోలు మరియు హీరోయిన్లు ఎక్కువగా విచ్చేసిన ఫంక్షన్ అయితే ఏది లేదనే చెప్పాలి. 

అయితే రేపు తెలుగు సినిమా ప్రొడక్షన్ ఎగ్జిక్యుటివ్స్ యూనియన్ వారు రజతోత్సవం సందర్భంగా భారీ ఎత్తున సినీ మహోత్సవం, రధసారధుల రజతోత్సవం  పేరుతో నిర్వహించే  వేడుకకు టాలీవుడ్ లోని దాదాపుగా బడా స్టార్ హీరోలందరూ హాజరవుతుండగా, హీరోయిన్లు కూడా చాలా మంది వస్తున్నారని, అయితే వారిలో ఒక డజను మంది మాత్రం ఆ ప్రోగ్రాం స్టేజి పై తమ ఆకట్టుకునే డాన్స్ పెర్ఫార్మన్స్ లతో ప్రేక్షకులను అలరిస్తారని కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసారు. హైదరాబాద్ లోని గచ్చి బౌలి ఇండోర్ స్టేడియంలో రేపు సాయంత్రం ఎంతో వైభవంగా ప్రారంభం కాబోతున్న ఈ వేడుకకు ఇప్పటికే ప్రముఖ మీడియా పార్టనర్ శ్రేయాస్ మీడియా వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు ప్రారంభించి, 

అన్ని సిద్ధం చేసినట్లు చెప్తున్నారు వేడుక నిర్వాహకులు. దాదాపుగా టాలీవుడ్ లోని నటీనటులు మరియు సాంకేతికనిపుణులు అందరూ కూడా హాజరయ్యేలా ప్లాన్ చేసిన ఈ వేడుకకు, పోలీసు బందోబస్తు కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ ప్రోగ్రాం టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడు పోతున్నాయని, అయితే కాసేపటి క్రితం డజను మంది హీరోయిన్లు ఈ ప్రోగ్రాంలో డాన్స్ చేస్తున్నారు అని తెలియగానే టికెట్స్ కు మరింతగా పోటీ ఏర్పడడం జరిగిందని అంటున్నారు. మరి ఎప్పటినుండో మన తెలుగు వారు అభిలషిస్తున్నట్లు, టాలీవుడ్ లోని హీరోలు మరియు హీరోయిన్లు అందరినీ కూడా ఒకే వేదికపై చూడాలన్న కోరిక, రేపు ఈ వేడుక ద్వారా తీరనుందన్నమాట......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: