టాలీవుడ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్ గా ఉంటాయో.. సంక్రాంతి సినిమాల మధ్య పోటీ కూడా అంత్ రసవత్తరంగా ఉంటుంది. ఓ పక్క పందెం కోళ్ల ఆట మరోపక్క తమ అభిమాన నటుల సినిమాల పోటీ బాక్సాఫీస్ పై దమ్ము చూపించేందుకు రెడీ అవుతారు. 2020 సంక్రాంతి బరిలో కూడా నువ్వా నేనా అంటూ పోటీకి సిద్ధమవుతున్నారు ఇద్దరు స్టార్స్. అందులో ఒకరు సూపర్ స్టార్ మహేష్ కాగా.. మరొకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.


భరత్ అనే నేను, మహర్షి బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో సూపర్ ఫాంలో ఉన్న మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో చేస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా కనిపిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి స్పెషల్ రోల్ చేస్తుంది. పటాస్ నుండి ఎఫ్ 2 వరకు వరుస హిట్లతో ఆడియెన్స్ నాడి కనిపెట్టిన అనీల్ మహేష్ సినిమాను హిట్ గా మలిచేందుకు కృషి చేస్తున్నాడు.


ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత చేస్తున్న సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ రెండు కలిసి నిర్మిస్తున్నాయి. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. మహేష్ వర్సెస్ అల్లు అర్జున్ ఇద్దరు బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టుకునేందుకు రెడీ అవుతున్నారు.  


ఇద్దరు హీరోలు ఎవరికివారు తమ సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్నారు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో ప్రచార చిత్రాలు కూడా మెప్పించాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం జనవరి 12న అల్లు అర్జున్ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. రెండు రోజుల తర్వాత అంటే జనవరి 14, 2020 మహేష్ సరిలేరు నీకెవ్వరు రిలీజ్ ఉంటుందట. సంక్రాంతి సమరానికి రెడీ అవుతున్న ఈ ఇద్దరు స్టార్స్ లో ఎవరిది బాక్సాఫీస్ పై పైచేయి అవుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: